News October 11, 2024

ఉమ్మడి ప.గో జిల్లాలో 8,770 టెండర్లు

image

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మద్యం దుకాణాలకు దరఖాస్తుల ప్రక్రియ నేటితో ముగియనుంది. మొత్తం జిల్లాలో 175 దుకాణాలకు గాను ఇప్పటికి 4495 దరఖాస్తులు అందాయని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. సుమారు రూ.90 కోట్ల ఆదాయం వచ్చినట్లుగా అధికారులు వెల్లడించారు. అలాగే ఏలూరు జిల్లాలో 144 మద్యం షాపులకు 4275 దరఖాస్తులు వచ్చాయన్నారు.

Similar News

News October 27, 2025

మొంథా తుఫాన్.. ఈ నంబర్ సేవ్ చేసుకోండి: కలెక్టర్

image

మొంథా తుపాను సందర్భంగా ఎటువంటి సమస్యలు తలెత్తినా ఏలూరు కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నంబర్ 08816 299219 ను సంప్రదించాలని జిల్లా కలెక్టర్ నాగరాణి సూచించారు. సోమవారం కలెక్టర్, ఎస్పీ కలిసి కంట్రోల్ రూమ్‌ను పరిశీలించారు. వచ్చిన కాల్స్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది అందరూ నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.

News October 27, 2025

పశ్చిమ గోదావరి జిల్లాలో 28 పునరావాస కేంద్రాలు

image

‘మొంథా’ తుఫాన్ దృష్ట్యా జిల్లా వ్యాప్తంగా ముందస్తు చర్యలు చేపట్టామని కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. జిల్లాలో మొత్తం 28 పునరావాస కేంద్రాలను సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు. నరసాపురం డివిజన్‌లో 10, తాడేపల్లిగూడెం డివిజన్‌లో 8, భీమవరం డివిజన్‌లో 10 కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. తుఫాన్ తీవ్రత, భారీ వర్షాలను దృష్టిలో ఉంచుకుని అదనంగా పునరావాస కేంద్రాలు ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు.

News October 27, 2025

‘మొంథా’ తుఫాను.. అగ్నిమాపక బృందాలు సిద్ధం

image

‘మొంథా’ ముప్పు నేపథ్యంలో ప.గో. అగ్నిమాపక శాఖ అధికారులు అప్రమత్తం అయ్యారు. జిల్లాలోని ఏడు అగ్నిమాపక కేంద్రాల పరిధిలో 90 మంది సిబ్బందిని సిద్ధం చేశారు. ఏడు ఫైర్‌ ఇంజన్లు, 10 నీటిని తోడే యంత్రాలు, 80 లైఫ్‌ జాకెట్లు, 40 లైఫ్‌ బాయ్స్‌, 30 రోప్‌లతోపాటు అత్యవసర పరికరాలను అందుబాటులో ఉంచారు. ముఖ్యంగా తుఫాన్‌ సమయంలో పడిపోయే చెట్లను తొలగించడానికి 12 బృందాలతో కూడిన 24 మంది ప్రత్యేక సిబ్బందిని నియమించారు.