News February 27, 2025
ఉమ్మడి ప.గో : తీరని విషాదం నింపిన శివరాత్రి

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో శివరాత్రి పలుకుటుంబాలకు తీరని విషాదం మిగిల్చింది. ఏలూరులో బలివే క్షేత్రానికి వెళ్లొచ్చి చెరువులో స్నానానికి దిగి వెంకటేశ్వరరావు, అతని తమ్ముని కుమారుడు సుబ్రహ్మణ్యం గల్లంతయ్యారు. ఆచూకీ తెలియలేదు. లింగపాలేనికి చెందిన అన్నదమ్ములు మణికుమార్, మునియ్య తమ్మిలేరులో మునిగి చనిపోయారు. పట్టిసీమలో నాగవీరభద్ర రావు, బలివే క్షేత్రానికి వచ్చిన అన్నవరం గుండెపోటుతో మృతి చెందారు.
Similar News
News January 9, 2026
వేములవాడ: ఈ నెల 21న కోడెల పంపిణీ

వేములవాడ పట్టణం తిప్పాపూర్లోని గోశాలలో ఈ నెల 21న కోడెలను పంపిణీ చేయనున్నట్లు ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఒక ప్రకటనలో తెలిపారు. 300 కోడెలను పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాతో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా, పరిసర జిల్లాల రైతులు అర్హులని స్పష్టం చేశారు. కోడెల కోసం 1.5 నుంచి 5 ఎకరాల వరకు సాగు భూమి ఉన్న సన్నకారు, చిన్నకారు రైతులు అర్హులన్నారు.
News January 9, 2026
కారులో ఊరెళ్తున్నారా.. ఈ జాగ్రత్తలు తీసుకోండి!

సంక్రాంతికి కారులో ఊరెళ్లేవాళ్లు ఈ జాగ్రత్తలు తీసుకోండి. జర్నీకి ముందురోజే కారు ఫుల్ ట్యాంక్ చేయించుకోండి. పొద్దున్నే సిటీ అవుట్ స్కట్స్ దాటేయండి. ఫుడ్, ఎక్స్ట్రా వాటర్ ఇంటి నుంచే తీసుకెళ్తే మంచిది. దాబాలు, రెస్టారెంట్లలో ఖాళీ ఉండదు. షార్ట్కట్లలోనే ట్రాఫిక్ ఎక్కువుండొచ్చు. మెయిన్ రోడ్లోనే వెళ్లడం సేఫ్. VJA హైవేలో 6 ఫ్లైఓవర్లు కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. అటు వెళ్లేవారికి కాస్త ఇబ్బంది కలగొచ్చు.
News January 9, 2026
వేములవాడ: భీమేశ్వరుడికి కోటిన్నర ఆదాయం

వేములవాడ రాజన్న అనుబంధ ఆలయమైన భీమేశ్వరస్వామి వారికి భక్తులు పెద్ద ఎత్తున కానుకలు సమర్పించారు. గత 15 రోజులకు గాను హుండీ ద్వారా రూ.1,15,17,894 నగదు ఆదాయం లభించినట్లు ఆలయ ఈవో రమాదేవి వెల్లడించారు. నగదుతో పాటు 32 గ్రాముల మిశ్రమ బంగారం, 3 కిలోల 100 గ్రాముల వెండిని భక్తులు మొక్కుబడిగా చెల్లించుకున్నారు. ఈవో పర్యవేక్షణలో క్షేత్రస్థాయిలో హుండీ లెక్కింపు ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించారు.


