News December 13, 2024
ఉమ్మడి ప.గో. రైతులకు ఇది తెలుసా?

ప.గో.జిల్లాలో మామిడి, కొబ్బరి పంటకు ఇన్సూరెన్స్ ఉంటుందని మీకు తెలుసా? మామిడి ఎకరాకు రూ.2250 చెల్లిస్తే రూ.45 వేలు.. ఒక్కో కొబ్బరి చెట్టుకు రూ.3.50 కడితే రూ.900 చొప్పున PM ఫసల్ బీమా యోజన కింద రైతులకు పరిహారం అందిస్తారు. డిసెంబర్15 నుంచి మే31 మధ్యలో వర్షాలు, ఉష్ణోగ్రతల మార్పులతో పంటకు నష్టం జరిగితే పరిహారం వస్తుంది. ఆధార్, బ్యాంక్ పాసుబుక్, 1బీ పత్రాలతో డిసెంబర్ 15లోగా మీసేవలో నమోదు చేసుకోవాలి.
Similar News
News October 27, 2025
ప.గో: మొంథా’ తుఫాన్.. నేటి పీజీఆర్ఎస్ రద్దు

‘మొంథా’ తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో అక్టోబర్ 27వ తేదీ సోమవారం కలెక్టరేట్లో జరగాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని మండల, డివిజన్, జిల్లా స్థాయిలో రద్దు చేసినట్లు కలెక్టర్ నాగరాణి తెలిపారు. ‘మొంథా’ తుఫాన్ కారణంగా జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, ఫిర్యాదుదారులు ఈ విషయాన్ని గమనించాలని ఆమె కోరారు.
News October 26, 2025
ప.గో.: కలెక్టర్, జేసీతో సమావేశమైన ప్రసన్న వెంకటేశ్

మొంథా తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో పశ్చిమగోదావరి జిల్లాకు కేటాయించిన ప్రత్యేక పర్యవేక్షణ అధికారి వి. ప్రసన్న వెంకటేశ్ ఆదివారం రాత్రి జిల్లాకు చేరుకున్నారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ నాగరాణి, జేసీ రాహుల్తో ఆయన సమావేశమయ్యారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాలు, ముందస్తుగా తీసుకున్న చర్యలపై సమీక్షించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుఫాన్గా మారే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.
News October 26, 2025
ప.గో: రెండు రోజలు విద్యాసంస్థలకు సెలవులు

‘మొంథా’ తుఫాను నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా పశ్చిమగోదావరి జిల్లాలో ఈ నెల 27, 28 తేదీల్లో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలకు సెలవు ప్రకటించినట్లు కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. కళింగపట్నం, కాకినాడ మధ్య ఈ నెల 27న తుఫాను తీరం దాటుతున్నందున ఇప్పటికే జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరిస్తుందని చెప్పారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.


