News March 24, 2024
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో నేటి కార్యక్రమాలు

✔వనపర్తి, నారాయణపేట, గద్వాల్ జిల్లాలలోని పలు మండలాలలో కరెంటు కట్
✔ఉమ్మడి జిల్లాలో కొనసాగుతున్న క్షయ వ్యాధి సర్వే
✔NRPT:నేడు ‘రజాకార్’ సినిమా ప్రదర్శన ✔నేటి రంజాన్ వేళలు:
ఇఫ్తార్(SUN):6:35, జోహార్(MON):4:56 ✔పలు నియోజకవర్గలో స్థానిక MLAల పర్యటన ✔ఉమ్మడి జిల్లాలో పలుచోట్ల కేంద్ర బలగాలతో కవాతు ✔MBNR:హోలీ..ప్రత్యేక రైళ్లు ✔ఎన్నికల కోడ్.. కొనసాగుతున్న తనిఖీలు ✔DSC(SA) ఉచిత శిక్షణకు దరఖాస్తు చేసుకోండి
Similar News
News November 7, 2025
హిందువులు సత్తా చాటాలి: MP డీకే అరుణ

2 లక్షలకు పైగా ఉన్న హిందువులంతా ఏకమై జూబ్లీహిల్స్ ఊప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని గెలిపించి సత్తా చాటాలని ఎంపీ డీకే అరుణ పిలుపునిచ్చారు. లంకల దీపక్ రెడ్డికి మద్దతుగా బోడబండలో నిర్వహించిన బహిరంగ సభలో ఎంపీ పాల్గొని మాట్లాడారు. గత పదేళ్లలో బీఆర్ఎస్ జూబ్లీహిల్స్లో అభివృద్ధి చేయలేదని, ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో చేసిన అభివృద్ధి శూన్యమని ఆమె విమర్శించారు.
News November 7, 2025
దళితులైతే దాడులు చేస్తారా?: మందకృష్ణ మాదిగ

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయిపై కాలు, బూటుతో దాడి చేయడాన్ని MRPS వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తీవ్రంగా ఖండించారు. ఆయన దళితుడు అయినందువల్లే ఇలాంటి దాడులకు పాల్పడ్డారని ఆయన మండిపడ్డారు. పాలమూరు విశ్వవిద్యాలయంలో గురువారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈనెల 17న నిర్వహిస్తున్న ‘చలో ఢిల్లీ’ కార్యక్రమాన్ని పీయూ నుంచి భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
News November 6, 2025
మహబూబ్నగర్: సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

సైబర్ జాగ్రుక్ దివస్ సందర్భంగా జడ్చర్లలోని మార్కెట్ యార్డులో అవగాహన సదస్సును గురువారం నిర్వహించారు. జిల్లా ఎస్పీ జానకీ మాట్లాడుతూ.. సైబర్ నేరాలు విస్తృతంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవడం అత్యవసరమన్నారు. సైబర్ నేరం జరిగిన వెంటనే https://www.cybercrime.gov.inలో లేదా 1930కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు.


