News January 1, 2025
ఉమ్మడి మెదక్ జిల్లాలో నేటి ఉష్ణోగ్రత వివరాలు

ఉమ్మడి మెదక్ జిల్లాలో బుధవారం ఉదయం 8.30 గంటల వరకు నమోదైన కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. సంగారెడ్డి జిల్లాలోని కోహీర్ 13.6, జహీరాబాద్, గుమ్మడిదల 14.1, న్యాల్కల్ 14.3, ఆర్సీపురం 14.6, ఝరాసంగం 14.7, అందోల్, మొగుడంపల్లి 14.8, మెదక్ జిల్లాలోని శివంపేట 15.0, టేక్మాల్, నర్సాపూర్ 15.6, వెల్దుర్తి 15.9, సిద్దిపేట జిల్లాలోని మర్కూక్ 15.1, వర్గల్, ములుగు 15.5, కుకునూరుపల్లి 16.1°C ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
Similar News
News November 10, 2025
మెదక్: ప్రజావాణి కార్యక్రమంలో 75 దరఖాస్తులు

మెదక్ కలెక్టరెట్లోని ప్రజావాణిలో మొత్తం 75 దరఖాస్తులు స్వీకరించినట్లు అదనపు కలెక్టర్ నగేష్ తెలిపారు. వీటిల్లో భూ సమస్యలకు సంబంధించి 34, పింఛన్లకు సంబంధించి 14, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి 05, దరఖాస్తులు వచ్చాయన్నారు. మిగిలిన 26 దరఖాస్తులు ఇతర సమస్యలకు సంబంధించినవని పేర్కొన్నారు. ప్రజావాణి దరఖాస్తులను పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
News November 10, 2025
మెదక్: ఆర్మీకి ఆర్ధికంగా సహకరిద్దాం: అదనపు కలెక్టర్

ఆర్మీకి సహాయ సహకారాలు, ఆర్ధికంగా సహకరిద్దామని అదనపు కలెక్టర్ నగేష్ అన్నారు. స్థానిక కలెక్టర్ కార్యాలయంలో భారత స్కౌట్ అండ్ గైడ్స్ వారోత్సవాల్లో భాగంగా భారత్ స్కౌట్ అండ్ గైడ్స్ స్టిక్కర్ను ఆవిష్కరించారు. ఆవిష్కరించిన స్టిక్కర్స్ను పాఠశాల స్కౌట్ అండ్ గైడ్స్ విద్యార్థులకు విక్రయించగా వచ్చే డబ్బులను ఆర్మీ, సహాయ సహకారాలకు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.
News November 10, 2025
మెదక్: స్టాండింగ్ కమిటీ సమావేశానికి హాజరైన ఎంపీ

స్టాండింగ్ కమిటీ సమావేశానికి మెదక్ ఎంపీ రఘునందన్ రావు హాజరయ్యారు. న్యూఢిల్లీలోని లోక్సభ సచివాలయంలో జరిగిన సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, చట్టం, న్యాయం తదితర కీలక అంశాలపై చర్చలు జరిగినట్లు పేర్కొన్నారు. ఈ సందర్బంగా పలు నిర్ణయాలు తీసుకున్నారు. సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, చట్టం, న్యాయం స్టాండింగ్ కమిటీ సభ్యులుగా రఘునందన్ రావు ఉన్నారు.


