News May 26, 2024

ఉమ్మడి మెదక్ జిల్లాలో పెరిగిన ఉష్ణోగ్రతలు

image

ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు మళ్లీ పెరిగాయి. ఈరోజు ఆటోమేటిక్ వెదర్ స్టేషన్లలో నమోదైన ఉష్ణోగ్రతల వివరాలు.. రేగోడు 44.4, కొల్చారం 44.2, పోడ్చన్ పల్లి 44.1, కల్హేర్, నాగపూర్ 43.8, కట్కూరు 43.6, శివంపేట, అంగడికిష్టాపూర్ 43.4, మిన్ పూర్, ప్రగతి ధర్మారం 43.1, తుక్కాపూర్ 43.0 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో జిల్లాకు ఆరంజ్ అలర్ట్ హెచ్చరికలు జారీ చేశారు.

Similar News

News April 10, 2026

మాసాయిపేట: గొంతులో ఇరుక్కున్న మాంసం ముక్క.. తొలగించిన వైద్యులు

image

విందు భోజనంలో మాంసం ముక్క గొంతులో ఇరుక్కుగా వైద్యులు తీవ్ర ప్రయత్నాలు చేసి తొలగించారు. మాసాయిపేట మండలం హకీంపేట గ్రామానికి చెందిన మల్లయ్య తూప్రాన్‌లో జరిగిన పెళ్లి విందుకు హాజరయ్యాడు. విందు భోజనంలో మాంసం ముక్క గొంతులో ఇరుక్కొని ఊపిరాడకుండా పడిపోయాడు. తూప్రాన్ ఆసుపత్రికి తరలించగా సూపరింటెండెంట్ అమర్ సింగ్ తీవ్రంగా శ్రమించి గొంతులో ఇరుక్కున్న ముక్కను తొలగించారు.

News April 10, 2026

రామాయంపేట: సైకిల్ పై నుంచి కిందపడి రైతు మృతి

image

సైకిల్ పై నుంచి కిందపడి రైతు చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన రామాయంపేట మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రగతి ధర్మారం గ్రామానికి చెందిన బొడ్డు మల్లయ్య అనే రైతు తన పొలానికి వెళ్లి వస్తుండగా సైకిల్‌కు కుక్క అడ్డు రావడంతో కిందపడి గాయాలయ్యాయి. ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

News April 10, 2026

కన్నవారు లేకున్నా.. చెల్లెళ్లకు అమ్మగా మారిన ‘లావణ్య’.

image

13 ఏళ్ల క్రితం తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన ముగ్గురు ఆడపిల్లల జీవితాల్లో పెద్దక్క లావణ్య వెలుగులు నింపింది. మెదక్ జిల్లా రామాయంపేటకి చెందిన బైరం యాదగిరి-రాజమణి దంపతులు మృతి చెందగా, చిన్న వయసులోనే ఇంటి బాధ్యతను లావణ్య భుజాన వేసుకుంది.​ కన్నీటిని దిగమింగి, అమ్మానాన్న లేని లోటు తెలియనీయకుండా తన ఇద్దరు చెల్లెళ్లు ప్రియాంక, పూజలను ఒక తల్లిలా సాకి ఉన్నత చదువులు చదివించింది. # నేడు సిబ్లింగ్స్ డే