News December 30, 2024
ఉమ్మడి వరంగల్ జిల్లాలో క్రైమ్ న్యూస్
> MLG: విద్యుత్ షాకుతో రైతు మృతి..
> MHBD: కొమ్ములవంచలో పురుగుమందు తాగి వ్యక్తి ఆత్మహత్య..
> WGL: తిమ్మంపేట లో గుట్కా ప్యాకెట్లు పట్టివేత..
> JN: డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన
> WGL: తల్లి, కూతురు సూసైడ్ అటెంప్ట్
> MLG: అడవి పంది, అడవి కోడిని వేటాడిన వ్యక్తులపై కేసు
> WGL: ధర్మారంలో గుర్తుతెలియని మృతదేహం
Similar News
News January 14, 2025
కొత్తకొండ వీరభద్ర స్వామి వారిని దర్శించుకున్న మంత్రి, MLA
కొత్తకొండ వీరభద్ర స్వామి వారిని మంత్రి పొన్నం ప్రభాకర్, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి అనుగ్రహంతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని, రాష్ట్రం అన్ని రంగాలలో ముందుకు దూసుకెళ్లాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉత్సవ కమిటీ సభ్యులు, తదితరులు ఉన్నారు.
News January 14, 2025
ఐనవోలు జాతరలో నూతన ఆర్టీసీ బస్సు ప్రారంభం
ఐనవోలు జాతరలో కొత్త ఆర్టీసీ బస్సును వరంగల్ ఆర్టీసీ డిప్యూటీ రీజినల్ మేనేజర్ కే భానుకిరణ్ ప్రారంభించారు. జాతరలోని తాత్కాలిక బస్ పాయింట్ వద్ద మంగళవారం హనుమకొండ డిపో మేనేజర్ భూక్యా ధరంసింగ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొని బస్సును ప్రారంభించారు. మాట్లాడుతూ.. భక్తుల సౌకర్యార్థం కొమురవెల్లి, వరంగల్ కు సుమారు 500 ట్రిప్పుల బస్సులను నడుపుతున్నట్లు తెలిపారు.
News January 14, 2025
జనగామ: హత్య కేసులో నిందితుల ARREST
హత్య కేసులో నిందితులను అరెస్ట్ చేసినట్లు ASP చేతన్ నితిన్ తెలిపారు. మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. జనగామలోని ధర్మకంచ వాసి సంపత్, హైదర్, లక్ష్మణ్ స్నేహితులు. వీరికి MHBD వాసి వెంకన్న(34)తో ఘర్షణ జరిగింది. ఈ గొడవని మనసులో పెట్టుకుని శనివారం రాత్రి మద్యం తాగించి మత్తులో బండరాయితో మోది, మెడ, తలపై బీర్ బాటిళ్లతో పొడిచి చంపేశారు. కాగా, 24 గంటల్లో నిందితులను పట్టుకున్నట్లు ASP తెలిపారు.