News August 19, 2024
ఉమ్మడి వరంగల్ జిల్లాలో టాప్ న్యూస్..

> HNK: ఆర్టీసీ బస్సును ఆపి సోదరుడికి రాఖీ కట్టిన అక్క
> MLG: సీఎం రేవంత్ రెడ్డికి రాఖీలు కట్టిన మంత్రులు కొండా సురేఖ, సీతక్క
> JN: మానవత్వం చాటుకున్న ఎంపీ కడియం కావ్య
> WGL: పాకాల సరస్సు వద్ద పర్యాటకుల సందడి
> MHBD: జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షం
> WGL: పలు కార్యాలయాల్లో ప్రజావాణి కార్యక్రమం
> BHPL: మంత్రుల పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన గండ్ర
Similar News
News November 5, 2025
ఎస్సీ విద్యార్థులకు గుడ్న్యూస్: రూ.3,500 స్కాలర్షిప్

జిల్లాలోని 9వ, 10వ తరగతి చదువుతున్న ఎస్సీ విద్యార్థులకు షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ తరఫున వారికి రూ.3,500 స్కాలర్షిప్ను మంజూరు చేయనున్నట్లు ఆ శాఖ అధికారి భాగ్యలక్ష్మి ప్రకటించారు. ఈ మేరకు జిల్లా పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల ప్రిన్సిపాళ్లు తమ విద్యార్థుల వివరాలను https://telanganaepass.cgg.gov.in/ వెబ్సైట్లో తప్పక నమోదు చేయాలని ఆమె ఆదేశించారు.
News November 4, 2025
వరద నష్టం నివేదిక తక్షణమే ఇవ్వాలి: కలెక్టర్

జిల్లాలో భారీ వర్షాల వల్ల పంటలు, ఆస్తులు, మౌలిక సదుపాయాలకు జరిగిన నష్టాలను తక్షణం నమోదు చేసి నివేదిక సమర్పించాలని కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆదేశించారు. కలెక్టరేట్లో వరదల ప్రభావం, పునరుద్ధరణపై ఆమె సమీక్ష నిర్వహించారు. భవిష్యత్తులో ముంపు సమస్యలు రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.
News November 4, 2025
ఇంటర్ బోర్డు ఆదేశాలు తప్పనిసరి: డీఐఈఓ

ఇంటర్మీడియట్ జూనియర్ కళాశాలల్లో బోర్డు ఆదేశాలను తప్పక పాటించాలని డీఐఈఓ శ్రీధర్ సుమన్ అన్నారు. ఆయన మంగళవారం పర్వతగిరి, నెక్కొండ కళాశాలలను సందర్శించి అడ్మిషన్ల ప్రక్రియ, తరగతులు, వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధి, మానసిక వికాసానికి కృషి చేయాలని అధ్యాపకులకు సూచించారు.


