News February 28, 2025

ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 93.57% పోలింగ్

image

ఉమ్మడి WGL-ఖమ్మం-నల్గొండ ఉపాధ్యాయ MLC ఎన్నికల పోలింగ్ నిన్న జరగగా.. మార్చి 3న నల్గొండలో లెక్కింపు జరగనుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా సా. 4 గం. వరకు 93.57% పోలింగ్ నమోదైంది. జిల్లాల వారీగా.. హనుమకొండ 91.66, వరంగల్ 94.13, జనగామ 94.31, మహబూబాబాద్ 94.47, భూపాలపల్లి 93.62, ములుగులో 92.83% పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. మీరు ఓటు వేశారా? కామెంట్ చేయండి.

Similar News

News October 20, 2025

కాసేపట్లో భారీ వర్షం..

image

TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్ జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. కాసేపట్లో యాదాద్రి భువనగిరి, జనగామ, రంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు తెలిపారు. హైదరాబాద్‌లో అర్ధరాత్రి నుంచి ఉదయంలోపు వానలు పడతాయని పేర్కొన్నారు. అటు ఏపీలోని కోస్తా జిల్లాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి.

News October 20, 2025

ప్రజా ప్రభుత్వంలో ప్రతి ఇంట ప్రగతి వెలుగులు: సీతక్క

image

రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఇంట సంక్షేమం, అభివృద్ధి వెలుగులు నిండాయని మంత్రి సీతక్క అన్నారు. ములుగు జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. గ్రూప్-1, గ్రూప్-2తో పాటు పలు ఉద్యోగ నియామకాలతో నిరుద్యోగుల ఇంట నిజమైన పండుగ జరుగుతోందని తెలిపారు. హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో కుటుంబ సభ్యులతో కలిసి సీతక్క దీపావళి వేడుకలు జరుపుకున్నారు.

News October 20, 2025

వనపర్తి: ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు బోనస్ ప్రశ్న..?

image

జిల్లాలో పది రోజుల్లో ఖరీఫ్ ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరుస్తామని అధికారులు ప్రకటించిన నేపథ్యంలో, రబీలో సేకరించిన సన్నధాన్యం బోనస్ ఏమైందని రైతులు ప్రశ్నించే అవకాశం ఉందని పీఏసీఎస్, ఐకేపీ, మెప్మా అధికారులు ఆందోళన చెందుతున్నారు. రబీలో సేకరించిన సన్నాలకు క్వింటాలుకు రూ.500 బోనస్ ఇంకా ఇవ్వలేదన్నారు. ఖరీఫ్ ధాన్యం తెచ్చిన రైతులు రబీ బోనస్ అడిగితే ఏమి చెప్పాలని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.