News February 28, 2025

ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 93.57% పోలింగ్

image

ఉమ్మడి WGL-ఖమ్మం-నల్గొండ ఉపాధ్యాయ MLC ఎన్నికల పోలింగ్ నిన్న జరగగా.. మార్చి 3న నల్గొండలో లెక్కింపు జరగనుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా సా. 4 గం. వరకు 93.57% పోలింగ్ నమోదైంది. జిల్లాల వారీగా.. హనుమకొండ 91.66, వరంగల్ 94.13, జనగామ 94.31, మహబూబాబాద్ 94.47, భూపాలపల్లి 93.62, ములుగులో 92.83% పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. మీరు ఓటు వేశారా? కామెంట్ చేయండి.

Similar News

News February 25, 2026

నిర్మల్: విద్యార్థుల సామర్థ్యాలపై ‘ఎఫ్ఎల్ఎన్’ సర్వే

image

జిల్లాలోని ఎంపిక చేసిన 53 ప్రాథమిక పాఠశాలల్లో బుధవారం నుంచి మూడు రోజుల పాటు ‘ఎఫ్ఎల్ఎన్’ (FLN) శాంపిల్ సర్వే ప్రారంభమైంది. రెండో తరగతి విద్యార్థులకు తెలుగు, ఇంగ్లిష్, గణితం అంశాల్లో ఉన్న కనీస సామర్థ్యాలను అధికారులు పరిశీలించనున్నారు. సర్వే నిర్వహణకు డైట్ చాత్రోపాధ్యాయులను ఇప్పటికే నియమించినట్లు విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. విద్యార్థుల అభ్యసన స్థాయిని అంచనా వేయడమే ఈ సర్వే ప్రధాన ఉద్దేశ్యం.

News February 25, 2026

వంటింటి చిట్కాలు

image

* పాత్రలు శుభ్రం చేయడానికి ఉపయోగించే నీటిలో కొద్దిగా బేకింగ్ సోడా కలిపితే నీచు వాసన రాకుండా ఉంటాయి.
* తేనె ముద్దగా అయితే, కాసేపు సీసాను వేణ్ణీళ్ళలో ఉంచండి.
* ప్లాస్టిక్ డబ్బాలు వాడనప్పుడు వాటిల్లో కాస్త ఉప్పు వేసి ఉంచితే, తిరిగి వాడుకునేప్పుడు ప్లాస్టిక్ వాసన రాదు.
* ఆలుగడ్డలు (బంగాళా దుంపలు) ఉడికించేప్పుడు ఆ నీళ్ళలో రెండు చుక్కల నిమ్మరసం లేదా కాస్త వెనిగర్ వేస్తే తెల్లగా వస్తాయి.

News February 25, 2026

HYD: షీ టీమ్స్ అదుపులో 264 మంది పోకిరీలు

image

నాంపల్లి ఎగ్జిబిషన్‌లో షీ టీమ్ పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేసి 264 మంది ఆకతాయిలను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 242 మంది మేజర్లు, 22 మంది మైనర్లు ఉన్నట్లు గుర్తించారు. 56 మందిపై పెట్టీ కేసులు నమోదు చేయగా, 52 మందికి కోర్టు రూ.1,050 జరిమానా విధించింది. మరో నలుగురికి 2 రోజుల జైలు శిక్షతో పాటు రూ.1000 జరిమానా విధించింది. 188 మందికి కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇచ్చారు.