News August 29, 2024

‘ఉమ్మడి విజయనగరం జిల్లాకు జ్వరమొచ్చింది’ 

image

విజయనగరం జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు జ్వరపీడితులతో కిక్కిరిసాయి. గడిచిన కొన్ని రోజుల నుంచి ఆసుపత్రులకు రోగుల తాకిడి పెరిగింది. సీహెచ్సీలలో రోజుకు 400 వరుకు ఓపీలు, పీహెచ్సీల్లో సుమారు 200 వరుకు ఓపీలు నమోదవుతున్నాయి. అధికారుల గణాంకాల ప్రకారం ఈ ఏడాది జులై వరుకు 435 మలేరియా,94 డెంగీ కేసులు నమోదయ్యాయి. క్షేత్ర స్థాయిల్లో వసతుల లేమితో రోగులు అవస్థలు పడుతున్నారు.

Similar News

News October 10, 2025

పోలీస్ సిబ్బంది సమస్యల పరిష్కారానికి కృషి: VZM SP

image

విజయనగరం జిల్లా పోలీసు సిబ్బంది సమస్యల పరిష్కారానికి ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ ప్రత్యేకంగా ‘పోలీసు వెల్ఫేర్ డే’ కార్యక్రమాన్ని తన కార్యాలయంలో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా సిబ్బంది నుంచి వ్యక్తిగత, శాఖాపరమైన విజ్ఞాపనలు స్వీకరించి, వాటి పరిష్కారానికి చర్యలు చేపడతానని తెలిపారు. పోలీసు సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ, ప్రతి సమస్యపై స్వయంగా స్పందిస్తానని ఆయన హామీ ఇచ్చారు.

News October 10, 2025

VZM: జిల్లా అధికారులకు కలెక్టర్ కీలక ఆదేశాలు

image

విజయనగరం జిల్లాలో రేపటి నుంచి రెండు రోజుల పాటు ఎలక్ట్రానిక్ పరికరాల ఎగ్జిబిషన్ కం సేల్ నిర్వహించాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. అధికారులతో శుక్రవారం వీసీ నిర్వహించి పలు సూచనలు చేశారు. మండల స్థాయి, నియోజకవర్గం, మున్సిపాలిటీ & జిల్లా స్థాయిలో ఈ ఎగ్జిబిషన్‌లు జరగాలన్నారు. ప్రజలకు GST అవగాహనతో పాటు తక్కువ ధరల్లో ఎలక్ట్రానిక్ వస్తువులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.

News October 10, 2025

ఓటర్ల జాబితా సవరణపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిందే: DRO

image

ఓటర్ల జాబితా సవరణపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాల్సిందేనని DRO శ్రీనివాసమూర్తి స్పష్టం చేశారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారులతో తన ఛాంబర్‌లో సమావేశం నిర్వహించారు. ఓటర్ల జాబితాలో సవరణకు వచ్చిన దరఖాస్తులు 7 రోజుల్లోగా పరిష్కారం కావాలన్నారు. ప్రతి రోజు క్లెయిమ్స్‌పై AERO, సంబంధిత BLOలతో మాట్లాడాలని, ఏ రోజు క్లెయిమ్స్ ఆ రోజే పరిష్కరిస్తే పెండింగ్ ఉండవని చెప్పారు.