News August 29, 2024
‘ఉమ్మడి విజయనగరం జిల్లాకు జ్వరమొచ్చింది’

విజయనగరం జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు జ్వరపీడితులతో కిక్కిరిసాయి. గడిచిన కొన్ని రోజుల నుంచి ఆసుపత్రులకు రోగుల తాకిడి పెరిగింది. సీహెచ్సీలలో రోజుకు 400 వరుకు ఓపీలు, పీహెచ్సీల్లో సుమారు 200 వరుకు ఓపీలు నమోదవుతున్నాయి. అధికారుల గణాంకాల ప్రకారం ఈ ఏడాది జులై వరుకు 435 మలేరియా,94 డెంగీ కేసులు నమోదయ్యాయి. క్షేత్ర స్థాయిల్లో వసతుల లేమితో రోగులు అవస్థలు పడుతున్నారు.
Similar News
News October 15, 2025
విజయనగరం జిల్లాలో 6,873 గృహ నిర్మాణాలు పూర్తి: కలెక్టర్

PMAY క్రింద మంజూరైన గృహాలను త్వరగా పూర్తి చేసి గృహ ప్రవేశాలకు సిద్ధంగా ఉంచాలని కలెక్టర్ ఎస్.రాం సుందర్ రెడ్డి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో హౌసింగ్ అధికారులతో సమీక్షించారు. జిల్లాలో 8,259 గృహాలు లక్ష్యం కాగా 6,873 గృహాలు ఇప్పటికే పూర్తయ్యాయని, మిగిలిన 1386 గృహాలను వేగంగా పూర్తి చేయాలని సూచించారు. ముందుగా అర్బన్లో సొంత స్థలాలు ఉన్న గృహాలను పూర్తి చేయాలన్నారు.
News October 15, 2025
బాణసంచా విక్రయాలకు అనుమతులు తప్పనిసరి: ఎస్పీ

దీపావళి సందర్భంగా బాణసంచా నిల్వలు, తయారీ, విక్రయాలకు సంబంధిత అధికారుల నుంచి అనుమతులు తప్పనిసరి అని జిల్లా ఎస్పీ దామోదర్ మంగళవారం తెలిపారు. తాత్కాలిక షాపులు పట్టణ శివార్లలోని బహిరంగ ప్రదేశాల్లో మాత్రమే ఏర్పాటు చేయాలని సూచించారు. అగ్ని ప్రమాదాల నివారణకు నీరు, ఇసుక తప్పనిసరిగా ఉంచాలని ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
News October 15, 2025
బాలికల సంక్షేమమే లక్ష్యం: DMHO

అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా విజయనగరం కేజీబీవీలో బాలికల ప్రాముఖ్యతపై మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. DMHO జీవన రాణి మాట్లాడుతూ.. బాలికల సంక్షేమానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. బాలికల కోసం ప్రత్యేక చట్టాలు అమల్లో ఉన్నాయని వారి హక్కులకు భంగం కలిగితే చర్యలు తప్పవన్నారు. అనంతరం ర్యాలీ చేపట్టి లింగ వివక్షత ఉండరాదని నినాదాలు చేశారు.