News September 24, 2024
ఉమ్మడి విశాఖలో ముగ్గురికి నామినేటెడ్ పదవులు

ఉమ్మడి విశాఖలో ముగ్గురికి నామినేటెడ్ పదవులు వరించాయి. అనకాపల్లి జిల్లా టీడీపీ అధ్యక్షుడు బత్తుల తాతయ్య బాబును రాష్ట్ర హౌసింగ్ బోర్డు ఛైర్మన్గా, ఏపీ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్గా అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే పీలా గోవిందు(టీడీపీ), ఏపీ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్గా (జనసేన)తమ్మిరెడ్డి శివశంకర్ను నియమించారు.
Similar News
News November 15, 2025
విశాఖ పార్టీ కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించిన మంత్రి లోకేశ్

విశాఖ టీడీపీ కార్యాలయంలో మంత్రి నారా లోకేశ్ శనివారం ప్రజాదర్బార్ నిర్వహించారు. ప్రజల నుంచి ఆయన వినతులు స్వీకరించారు. వ్యవసాయ భూమిని కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారని విజయనగరానికి చెందిన బంగారి శ్రీనివాసరావు మంత్రి లోకేశ్ను కలిసి ఫిర్యాదు చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న తన కుమార్తెకు వైద్యసాయం అందించి ఆదుకోవాలని నెల్లూరుకు చెందిన కొప్పాల సుధాకర్ విజ్ఞప్తి చేశారు.
News November 15, 2025
విశాఖ-హైదరాబాద్ రూ.18వేలు

విశాఖలో జరుగుతున్న CII సమ్మిట్కు పారిశ్రామికవేత్తలు, డెలిగేట్స్ భారీగా తరలివచ్చారు. శుక్రవారం సదస్సు ప్రారంభం కాగా.. ముందురోజే నగరానికి చేరుకున్నారు. దీంతో గురువారం నుంచి రెగ్యులర్ సర్వీసులతో పాటు అదనంగా మరికొన్ని విమానాలను నడిపినట్లు విమానాశ్రయ అధికారులు తెలిపారు. నేటితో సమ్మిట్ ముగియనుండడంతో హైదరాబాద్ నుంచి విశాఖకు టికెట్ రూ.4,000 – 5,000 వరకు ఉండగా.. విశాఖ-హైదరాబాద్ రూ.18వేల వరకు ఉంది.
News November 14, 2025
అయోధ్య తరహాలో సింహాచలం డిజైన్ లైటింగ్: గంటా

అయోధ్య తరహాలో సింహాచలానికి డిజైన్ లైటింగ్ ఏర్పాటు చేస్తామని భీమిలి MLA గంటా శ్రీనివాసరావు తెలిపారు. శుక్రవారం సింహాచలంలో ఆయన పర్యటించారు. BRTS రోడ్డులో రూ.1.37 కోట్లు వ్యయంతో సెంట్రల్ లైటింగ్ ప్రారంభించారు. అడవివరం-పాతగోశాల వరకు లైటింగ్ పూర్తి చేసినట్లు చెప్పారు. దేవస్థానానికి రెగ్యులర్ ఈఓ లేకపోవడంతో సమస్యలు పెరిగాయని, త్వరలో నియామకం జరగేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.


