News September 23, 2024

ఉమ్మడి విశాఖలో 16 మంది తహశీల్దార్లు బదిలీ

image

ఉమ్మడి విశాఖ జిల్లాలో 16 మంది తహశీల్దార్లను కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ బదిలీ చేశారు. వీరిలో 8 మందిని విశాఖ జిల్లాకు, ఐదుగురిని అనకాపల్లి జిల్లాకు, ముగ్గురిని అల్లూరి జిల్లాకు బదిలీ అయ్యారు. బదిలీ అయిన వారిలో ఎంబీ అప్పారావు, పీ.లచ్చాపాత్రుడు, ఎస్.రాణి అమ్మాజీ, కే.జానకమ్మ, ఎస్.రామారావు, ఏ.శ్రీనివాసరావు, కే.రమాదేవి, ఎస్.నాగమ్మ, వేణుగోపాల్, శ్యామ్ కుమార్, కే.జయ ప్రకాశ్ తదితరులు ఉన్నారు.

Similar News

News January 7, 2026

విశాఖ: సంక్రాంతికి ఊరు వెళ్తున్నారా?

image

విశాఖ పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి ఆదేశాలతో నగరంలో నేరాలపై అవగాహన సదస్సులు నిర్వహించారు. సైబర్ నేరాలు, దొంగతనాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. ఊరు వెళ్లేటప్పుడు LHMS సేవలు వాడాలని, ఇళ్లకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని కోరారు. వాకింగ్‌కు వెళ్లే మహిళలు ఆభరణాల పట్ల జాగ్రత్తగా ఉండాలని, పనివారి వివరాలు సేకరించాలని, వాహనాలకు విధిగా తాళాలు వేయాలని స్పష్టం చేశారు.

News January 7, 2026

జీవీఎంసీ అడిషనల్ కమిషనర్‌గా నల్లనయ్య

image

జీవీఎంసీ అడిషనల్ కమిషనర్‌గా పి. నల్లనయ్య‌ను నియమిస్తూ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా పనిచేస్తున్న నల్లనయ్య పదోన్నతిపై బదిలీ కాగా జీవీఎంసీలో అదనపు కమిషనర్‌గా పోస్టింగ్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

News January 7, 2026

జీవీఎంసీ అడిషనల్ కమిషనర్‌గా నల్లనయ్య

image

జీవీఎంసీ అడిషనల్ కమిషనర్‌గా పి. నల్లనయ్య‌ను నియమిస్తూ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా పనిచేస్తున్న నల్లనయ్య పదోన్నతిపై బదిలీ కాగా జీవీఎంసీలో అదనపు కమిషనర్‌గా పోస్టింగ్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.