News November 13, 2024
ఉమ్మడి విశాఖ జిల్లాలో కార్పొరేషన్ డైరెక్టర్లు వీరే

రాష్ట్ర గవర కార్పొరేషన్కు ప్రభుత్వం 15 మంది డైరెక్టర్లను నియమించింది. ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందినవారు 11 మంది ఉన్నారు. పరమేశ్వరరావు(పెందుర్తి),పి.అజయ్ బాబు (విశాఖ),ఏ.మంగరాజు (నర్సీపట్నం), బి.శ్రీనివాసరావు (ఎలమంచిలి),బీ.గోపికృష్ణ (విశాఖ), బి.లక్ష్మీనారాయణ (విశాఖ),బి.నాగ గంగాధర్ (చోడవరం), పి.శ్రీనివాసరావు (విశాఖ) ఎం.రవికుమార్ (విశాఖ), బి.శ్రీనివాసరావు(అనకాపల్లి ),వి.హరికృష్ణ (అనకాపల్లి) ఉన్నారు.
Similar News
News October 27, 2025
విశాఖలో పలుచోట్ల నేలకొరుగుతున్న చెట్లు

మొంథా తుపాన్ నేపథ్యంలో వర్షంతో పాటు ఈదురు గాలులు బలంగా ఇస్తున్నాయి. నగరంలోని పలు ప్రాంతాలలో సోమవారం ఉదయం నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. రామాటాకీస్, కైలాసపురం ఎన్జీవో కాలనీ, రైల్వే క్వార్టర్స్, కంచరపాలెం తదితర ప్రాంతాలలో చెట్లు నేలకొరిగాయి. అడపా దడపా భారీ వర్షం కూడా కురుస్తోంది. సహాయక చర్యల్లో అధికార యంత్రాంగం నిమగ్నమయ్యింది.
News October 27, 2025
విశాఖ: మొంథా తుఫాన్.. జాగ్రత్తగా ఉండండి

తుఫాన్ నేపథ్యంలో విశాఖలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. దీంతో కలెక్టర్ హరేంధిర ప్రసాద్ జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. పెను గాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ 0891- 2590102, 0891- 2590100 ఏర్పాటు చేశారు. సముద్ర స్నానాలు నిషేధించారు. జిల్లాలోని అన్ని విద్యాసంస్థలకు 2 రోజులు సెలవులు ప్రకటించారు.
News October 27, 2025
విశాఖలో రౌడీషీటర్లకు కౌన్సెలింగ్

విశాఖలోని పలు పోలీస్ స్టేషన్లలో రౌడీషీటర్లకు ఆదివారం కౌన్సెలింగ్ ఇచ్చారు. ఎయిర్ పోర్ట్ సీఐ ఉమా మహేశ్వరరావు రౌడీ షీటర్లకు సత్ప్రవర్తనతో మెలగాలని, నిత్యం పోలీసుల నిఘా ఉంటుందని హెచ్చరించారు. ఎటువంటి అసాంఘిక కార్యకలాపాల్లో తలదూర్చకుండా ఉండాలన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే పీడీ యాక్ట్ నమోదు చేస్తామన్నారు.


