News April 2, 2024
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా కాంగ్రెస్ అభ్యర్థులు వీరే

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో కాంగ్రెస్ అసెంబ్లీ అభ్యర్థులను ఆ పార్టీ అధిష్ఠానం మంగళవారం ప్రకటించింది. ఇచ్చాపురం – వసుపత్రి చక్రవర్తిరెడ్డి, పలాస – మజ్జి త్రినాథ్ బాబు, పాతపట్నం – కొప్పురోతు వెంకటరావు, శ్రీకాకుళం – పైడి నాగభూషణరావు, ఆమదాలవలస – సనపల అన్నాజీరావు, ఎచ్చెర్ల – కరిమజ్జి మల్లేశ్వరరావు, నరసన్నపేట – మంత్రి నరసింహమూర్తి, రాజాం – కంబాల రాజవర్దన్, పాలకొండ – చంటిబాబు.
Similar News
News April 20, 2025
వివాహిత హత్య.. నిందితుడి కోసం గాలింపు

రణస్థలంలోని పైడిభీమవరంలో నడిరోడ్డుపై శనివారం వివాహిత భవాని దారుణ హత్య కలకలం రేపిన సంగతి తెలిసిందే. గుర్తు తెలియని వ్యక్తి చాకుతో ఆమె గొంతుకోసి సంఘటన స్థలంలోనే చాకును నీళ్లతో కడిగి పడేసి వెళ్లాడు. మృతురాలు పని చేస్తున్న హోటల్లోని వ్యక్తిపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. భవానీ స్వగ్రామం విజయనగరం(D) పెద్ద పతివాడ గ్రామం. నాలుగేళ్ల క్రితం పైడిభీమవరంలోని వెంకట సత్యంతో ఈమెకు వివాహమైంది.
News April 20, 2025
నేడే మెగా డీఎస్సీ.. శ్రీకాకుళం జిల్లాలో 458 పోస్టులు

ఆదివారం ఉదయం 10 గంటలకు 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ను మంత్రి నారా లోకేష్ విడుదల చేయనున్నారు. శ్రీకాకుళం జిల్లాలో 458 పోస్టులు కలవు. ఇందులో SA లాంగ్వేజ్-1లో 37, SA హిందీ 11, SA ఇంగ్లీష్ 65, SA మ్యాథ్స్ 33, SA-PS 14, SA-BS 34, SA సోషల్ 70, SA-PE 81, SGT 113 పోస్టులు ఉన్నాయి. ట్రైబల్ వేల్ఫేర్ ఆస్రంలో 85 పోస్టులు భర్తీ చేయనున్నారు.
News April 20, 2025
ఇచ్ఛాపురంలో నేడు కేంద్రమంత్రి పర్యటన

ఇచ్ఛాపురం నియోజకవర్గంలో నేడు(ఆదివారం) కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పర్యటించనున్నారు. సోంపేట మండల కేంద్రంలో అగ్రికల్చర్ ఆఫీస్ భవనాన్ని ప్రారంభించనన్నారు. కంచిలి మండలం అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ సమావేశంలో పాల్గొంటారు. ఇచ్ఛాపురం మండలంలో బెల్లుపడలో జరుగుతున్న యజ్ఞంలో పాల్గొని, అనంతరం ప్రజలు నుండి వినతులు స్వీకరిస్తారు.