News January 6, 2025
ఉమ్మడి ADBపై చలి పంజా
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలి పంజా విసురుతోంది. ఆదివారం ఉష్ణోగ్రతల వివరాలు ఇలా ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో అత్యల్పంగా అర్లి(T)లో 5.9, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో సిర్పూర్(U) 6.0, నిర్మల్ జిల్లాలో పెంబి 8.0, మంచిర్యాల జిల్లాలో నెన్నెల 9.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉమ్మడి జిల్లాలో ఉష్ణోగ్రతలు మరింతగా తగ్గాయి.
Similar News
News January 18, 2025
నిర్మల్ జిల్లాలో 12 ఏళ్ల బాలుడి దారుణహత్య
నిర్మల్ జిల్లాలో దారుణం జరిగింది. చిట్యాలలో 12 ఏళ్ల బాలుడిని గుర్తు తెలియని వ్యక్తులు బండరాయితో కొట్టి హత్య చేశారు. స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన రిషి (12) కల్లు బట్టిలో పనిచేస్తున్నాడు. కాగా గ్రామ శివారులోని చింతలచెరువు సమీపంలో రిషి మర్మంగాలపై బండరాయితో దాడి చేసి హత్య చేశారు. ఇవాళ బహిర్భూమికి వెళ్లిన గ్రామస్థులు రిషి మృతదేహన్ని గుర్తించి నిర్మల్ పోలీసులకు సమాచారం అందించారు.
News January 18, 2025
సారంగాపూర్: చిరుత పులి దాడిలో లేగదూడ మృతి
సారంగాపూర్ మండలంలోని ఆదివాసీ తండా, దుప్యతండాల మధ్య అటవీ క్షేత్రం సమీపంలో చిరుత దాడిలో రైతు జాదవ్ ప్రేమ్కుమార్ చెందిన లేగదూడ మృతి చెందినట్లు అటవీ ఉప క్షేత్ర అధికారి నజీర్ ఖాన్ తెలిపారు. రైతు సమాచారం అందించడంతో ఘటనాస్థలానికి చేరుకొని శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. లేగదూడ మృతదేహానికి పంచనామా నిర్వహించినట్లు తెలిపారు. ఆయన వెంట ఎఫ్బీఓలు సుజాత, వెన్నెల తదితరులు ఉన్నారు.
News January 18, 2025
ADB: ఉచిత శిక్షణకు దరఖాస్తులు.. APPLY NOW
రాష్ట్ర మైనార్టీ స్టడీ సర్కిల్ ద్వారా ముస్లిం, క్రిస్టియన్, సిక్కు, బౌద్ధిస్ట్, పార్శి అభ్యర్థులకు గ్రూప్-1,2,3,4, RRB, SSC, బ్యాంకింగ్ మొదలైన పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఆదిలాబాద్ DMWO రాజలింగు తెలిపారు. అర్హులైన అభ్యర్థులు ఫిబ్రవరి 15 లోపల మైనార్టీ సంక్షేమ శాఖ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. నాలుగు నెలల బేసిక్ ఫౌండేషన్ కోర్సు ఇస్తామని.. అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.