News February 14, 2026

ఉమ్మడి ADBలో బీజేపీ కోటకు బీటలు

image

శుక్రవారం వెలువడిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలలో ఉమ్మడి ఆదిలాబాద్‌లో బలమైన శక్తిగా ఉన్న బీజేపీకి గట్టి దెబ్బ తగిలింది. ఉమ్మడి జిల్లాలో ఆ పార్టీ నుంచి నలుగురు MLAలు, ఒక MP ఉండటంతో బీజేపీకి అనుకూల ఫలితాలు వస్తాయని భావించారు. కానీ అనూహ్యంగా ADB(21) మినహాయిస్తే నిర్మల్, మంచిర్యాల, కాగజ్‌నగర్, ఆసిఫాబాద్ మున్సిపాలిటీల్లో కనీస పోటీ ఇవ్వలేకపోయింది. ప్రతిష్ఠాత్మకంగా భావించిన భైంసాలో సైతం చతికిలబడింది.

Similar News

News March 7, 2026

నేపాల్ రాజకీయాలను మలుపుతిప్పిన ‘స్టార్లు’

image

ఎన్నికల ఫలితాల్లో రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ జోరుతో నేపాల్ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. దీని వెనుక ఇద్దరు ‘స్టార్లు’ ఉన్నారు. ఒకరు TV ప్రెజెంటర్, RSP ఫౌండర్ రబి లామిచానే కాగా మరొకరు ర్యాపర్ బాలెన్ షా. 2022లో RSP స్థాపించిన రబి, రాజకీయ చతురతతో తక్కువకాలంలో Dy.PM హోదాకు చేరారు. ఇక ర్యాపర్ బాలెన్ షా యువతలో ఆదరణ సంపాదించారు. 2025లో షా RSPలో చేరి రబితో చేతులు కలపడంతో అక్కడి పాలిటిక్స్‌ మలుపు తిరిగాయి.

News March 7, 2026

సిరిసిల్ల: ‘ప్రజా పాలన’తో గ్రామాల్లో మార్పు: కలెక్టర్

image

ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ద్వారా గ్రామాల్లోని సమస్యలను పరిష్కరించి సమూల మార్పు తీసుకువస్తామని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో జిల్లాలో కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహిస్తామన్నారు. ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా జిల్లా యంత్రాంగాన్ని సమన్వయం చేస్తూ, క్షేత్రస్థాయిలో ప్రజలకు మేలు జరిగేలా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతామని కలెక్టర్ స్పష్టం చేశారు.

News March 7, 2026

కరీంనగర్: ప్రజా పాలనపై మంత్రుల కీలక సమీక్ష!

image

కలెక్టరేట్ ఆడిటోరియంలో ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణపై మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్ సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్న ఈ సమావేశంలో.. జిల్లాలో పరిసరాల పరిశుభ్రత, కార్యాలయాల్లో ఫైళ్ల పర్యవేక్షణ వంటి అంశాలపై దిశానిర్దేశం చేశారు. ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి లక్ష్యాలను చేరుకోవాలని అధికారులను ఆదేశించారు.