News February 1, 2025

ఉమ్మడి ADB జిల్లాలో ఎంత మంది ఓటర్లున్నారో తెలుసా..!

image

మెదక్- నిజామాబాద్- ఆదిలాబాద్- కరీంనగర్ నియోజకవర్గ పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నగారా మోగింది. ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో అభ్యర్థులు తమ ప్రచారాన్ని ముమ్మరం చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. ఫిబ్రవరి 27న జరగనున్న ఈ ఎన్నికల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 5, 512 మంది ఉపాధ్యాయులు, 67, 768 మంది పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

Similar News

News December 1, 2025

ADB: ‘డబ్బు పంపండి.. లేదంటే న్యూడ్ ఫొటోలు పంపుతాం’

image

ఆదిలాబాద్ జిల్లాలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. బోథ్‌కు చెందిన ఓ ప్రైవేటు ఉపాధ్యాయుడికి ఓ నంబర్ నుంచి కాల్ వచ్చింది. వెంటనే తన అకౌంట్‌కు డబ్బులు పంపాలని లేదంటే బాధితుడి న్యూడ్ ఫొటోలు ఫ్రెండ్స్‌కు, రిలేటివ్స్‌కు పంపుతాం అని హిందీలో బెదిరించారు. ఫోన్ నంబర్ పాకిస్థాన్‌కు చెందినదిగా గుర్తించి బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

News December 1, 2025

పానీపూరీ కోసం తెరిచిన నోరు మూసుకోలేదు

image

UP ఔరైయాలో వింత ఘటన జరిగింది. పానీపూరి తినబోయిన మహిళ దవడ డిస్‌లొకేట్ అయ్యింది. మేనకోడలు డెలివరీ కోసం ఇంకాలా దేవి ఆస్పత్రికి వెళ్లారు. పిల్లలతో కలిసి ఆవిడ కూడా పానీపూరీ తినేందుకు వెళ్లారు. అయితే ఓ పెద్ద పూరీ తినేందుకు ఆమె నోరు తెరవగా అది తిరిగి మూసుకోలేదు. చివరికి వైద్యులు చికిత్స చేసి దానిని సరి చేశారు. సడెన్‌గా, ఏదో పెద్ద ఫుడ్ ఐటమ్ తినేందుకు నోరు తెరవడంతో అలా అయ్యిందని చెప్పారు.

News December 1, 2025

42వేల మంది HIV బాధితులకు పెన్షన్లు: సత్యకుమార్

image

AP: 2030నాటికి HIV రహిత రాష్ట్రమే లక్ష్యంగా కృషి చేస్తున్నట్లు మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. ‘HIV పాజిటివిటీ రేటు 0.10 శాతం నుంచి 0.04 శాతానికి తగ్గింది. కొత్త కేసుల్లో ITఉద్యోగులు ఉండటం ఆందోళనకరం. సేఫ్ సెక్స్‌పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి. దాదాపు 42వేల మంది HIV బాధితులకు పెన్షన్లు ఇస్తున్నాం. త్వరలో మిగిలిన అర్హులైన వారికీ పెన్షన్ల మంజూరుకు చర్యలు తీసుకుంటున్నాం’ అని తెలిపారు.