News January 30, 2025
ఉమ్మడి ADB జిల్లాలో ఎకో టూరిజం అభివృద్ధి: CM

ఉమ్మడి ADB జిల్లాలో ఎకో టూరిజంను అభివృద్ధి చేసేలా ప్రణాళికలు రూపొందించాలని CM రేవంత్రెడ్డి పేర్కొన్నారు. బుధవారం టూరిజం పాలసీపై మంత్రి జూపల్లి, టూరిజం కార్పొరేషన్ ఛైర్మన్ పటేల్ రమేశ్, CS శాంతికుమారితో సమావేశమయ్యారు. పర్యాటక అభివృద్ధితో రాష్ట్రానికి మరింత గుర్తింపు, ఆదాయం వచ్చేలా పాలసీ రూపొందించాలని సూచించారు. వచ్చే గోదావరి పుష్కరాలకు భక్తులు, పర్యాటకులను ఆకర్షించేలా ప్రణాళికలు చేయాలన్నారు.
Similar News
News February 27, 2026
ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలి: జేసీ

జిల్లాలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని శుక్రవారం DIEPC సమావేశంలో జేసీ నిధి మీనా సంబంధిత అధికారులను ఆదేశించారు. సింగిల్ డెస్క్ పోర్టల్ ద్వారా 18 శాఖలకు సంబంధించి 11,033 దరఖాస్తులు వచ్చాయని, 10,886 దరఖాస్తులకు అనుమతి ఇవ్వడం జరిగిందన్నారు. 10,836 పరిశీలనలో, 50 పరిశీలనకు సిద్ధంగా ఉన్నాయన్నారు. 88 దరఖాస్తులను తిరస్కరించడం జరిగిందన్నారు. 59 దరఖాస్తులు పెండింగ్లో ఉంచడం జరిగిందన్నారు.
News February 27, 2026
రింకూ సింగ్.. తండ్రి చనిపోయిన బాధలోనూ..

T20WC: యంగ్ క్రికెటర్ రింకూ సింగ్ రేపు కోల్కతాలో భారత జట్టులో చేరుతారని బీసీసీఐ వెల్లడించింది. మార్చి 1న టీమ్ ఇండియా ఈడెన్ గార్డెన్స్లో వెస్టిండీస్తో తలపడనుంది. కాగా ఇవాళ తండ్రి మరణంతో <<19254408>>రింకూ<<>> సింగ్ అలీగఢ్ (యూపీ) వెళ్లిన సంగతి తెలిసిందే. తండ్రి <<19250311>>మరణించిన<<>> మరుసటి రోజే రింకూ దేశం కోసం ఆడేందుకు సిద్ధం కావడంపై నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
News February 27, 2026
కృష్ణా జిల్లాలో టుడే టాప్ న్యూస్

డిజిటల్ అరెస్ట్ అనేది చట్టంలో లేదు: కృష్ణా SP
* ఇబ్రహీంపట్నంలో జోగి రమేశ్ను పరామర్శించిన లక్ష్మీపార్వతి
* ఆయేషా మీరా కేసులో న్యాయం జరగలేదని పేరెంట్స్ ఆవేదన
* మచిలీపట్నంలో డిజిటల్ అరెస్టు నుంచి కాపాడిన పోలీసులు
* CRDA కార్యాలయంలో ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్
* బాపులపాడు డిప్యూటీ MPDOపై సస్పెన్షన్ వేటు
* గన్నవరం ఎయిర్పోర్ట్లో ఏర్పాట్లు పరిశీలించిన అధికారులు


