News January 30, 2025
ఉమ్మడి ADB జిల్లాలో ఎకో టూరిజం అభివృద్ధి: CM

ఉమ్మడి ADB జిల్లాలో ఎకో టూరిజంను అభివృద్ధి చేసేలా ప్రణాళికలు రూపొందించాలని CM రేవంత్రెడ్డి పేర్కొన్నారు. బుధవారం టూరిజం పాలసీపై మంత్రి జూపల్లి, టూరిజం కార్పొరేషన్ ఛైర్మన్ పటేల్ రమేశ్, CS శాంతికుమారితో సమావేశమయ్యారు. పర్యాటక అభివృద్ధితో రాష్ట్రానికి మరింత గుర్తింపు, ఆదాయం వచ్చేలా పాలసీ రూపొందించాలని సూచించారు. వచ్చే గోదావరి పుష్కరాలకు భక్తులు, పర్యాటకులను ఆకర్షించేలా ప్రణాళికలు చేయాలన్నారు.
Similar News
News October 21, 2025
పదిలో ఉత్తమ ఫలితాలు సాధించేలా కార్యాచరణ: కలెక్టర్

పదో తరగతి విద్యార్థులు వార్షిక పరీక్షలలో ఉత్తమ ఫలితాలు సాధించే విధంగా 100 రోజుల కార్యాచరణ అంబేడ్కర్ కోనసీమ జిల్లా విద్యాశాఖ రూపొందించడం జరిగిందని కలెక్టర్ మహేశ్ కుమార్ తెలిపారు. ఈ వందరోజుల కార్యాచరణ ప్రణాళికకు సంబంధించిన బ్రోచర్ను ఆయన మంగళవారం అమలాపురంలోని కలెక్టరేట్ వద్ద ఆవిష్కరించారు. డీఈవో షేక్ సలీం భాష, సీఎంఓ సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.
News October 21, 2025
‘NITI’ తీరుతో ప్రమాదంలో 113 సిటీలు: పర్యావరణ వేత్తలు

CRZ రిస్ట్రిక్షన్స్ను 500 నుంచి 200 మీటర్లకు కుదించాలన్న నీతి ఆయోగ్ సిఫార్సును తిరస్కరించాలని పర్యావరణవేత్తలు PMకి విన్నవించారు. ‘సముద్ర మట్టం పెరుగుదల వల్ల 2050కు దేశంలోని 113 సిటీలు మునిగిపోతాయని INDIA డవలప్మెంటు రిపోర్టు చెబుతోంది. ప్రస్తుత రూలే కాలం చెల్లగా, ఇంకా కుదించడం మరింత ప్రమాదం’ అని పేర్కొన్నారు. సీ లెవెల్ 91MM పెరిగిందని, ముంపు వంటి ఉపద్రవాలపై నాసా హెచ్చరించిందని గుర్తుచేశారు.
News October 21, 2025
అమలాపురం: PM ఆదర్శ యోజన పథకంపై కలెక్టర్ సమీక్ష

మధ్యలో నిలిచిన పీఎం ఆదర్శ గ్రామ యోజన గ్రామ అభివృద్ధి ప్రణాళికలలో సౌకర్యవంతంగా ఉన్న పనులకు నిధులు ఖర్చు చేయాలని కలెక్టర్ మహేశ్ కుమార్ ఆదేశించారు. అవసరంలేని పనులకు కేటాయించిన నిధులు వేరే పనులకు కేటాయించాలని చెప్పారు. మంగళవారం అమలాపురం కలెక్టరేట్లో పీఎం ఆవాస్ యోజన మొదటి రెండు దశల గ్రామాభివృద్ధి ప్రణాళికలపై DLDO, ఎంపీడీవోలతో సమీక్ష జరిపారు. 40% పైబడి ఎస్సీలు ఉన్న ప్రాంతానికి పథకం ఉపయోగపడుతుందన్నారు.