News June 21, 2024

ఉమ్మడి MBNR జిల్లాలో నేటి ఉష్ణోగ్రత వివరాలు ఇలా..

image

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా శుక్రవారం నమోదైన ఉష్ణోగ్రత వివరాలు ఇలా.. అత్యధికంగా నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండలో 38.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. గద్వాల జిల్లా అలంపూర్లో 37.8, మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్లో 37.5, వనపర్తి జిల్లా శ్రీరంగాపూర్లో 36.8, నారాయణపేట జిల్లా కృష్ణలో 36.7 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Similar News

News October 16, 2025

కురుమూర్తి బ్రహ్మోత్సవాల గోడపత్రిక ఆవిష్కరణ

image

చిన్నచింతకుంట మండలం అమ్మాపురం శివారులోని శ్రీ కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు ఈనెల 22 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా గురువారం ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి బ్రహ్మోత్సవాల గోడ పత్రికలను విడుదల చేశారు. ఈ మేరకు శ్రీ కురుమూర్తి దేవస్థాన ఛైర్మన్ జి.గోవర్ధన్ రెడ్డి ఎమ్మెల్యేకు ఆహ్వన పత్రిక అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన కార్యనిర్వహణ అధికారి, పాలకమండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

News October 16, 2025

పాలమూరు యూనివర్సిటీ స్నాతకోత్సవానికి హాజరైన గవర్నర్

image

పాలమూరు యూనివర్సిటీలో గురువారం నిర్వహించిన 4వ కాన్వకేషన్ (స్నాతకోత్సవం) కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ శర్మ హాజరయ్యారు. ఈ సందర్భంగా పాలమూరు యూనివర్సిటీలో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ జానకి ఏర్పాట్లను పరిశీలించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి, వీసీ శ్రీనివాస్ ఉన్నారు.

News October 16, 2025

పాలమూరు బిడ్డకే గౌరవ డాక్టరేట్

image

ఉమ్మడి పాలమూరు జిల్లా నవాబుపేట(M) గురుకుంటకి చెందిన పారిశ్రామికవేత డాక్టర్ మన్నే సత్యనారాయణ రెడ్డి (MSN)కి పాలమూరు యూనివర్సిటీ మొట్టమొదటి గౌరవ డాక్టరేట్ నేడు గవర్నర్ చేతి మీదగా ప్రదానం చేయనుంది. ఎంఎస్ఎన్ గ్రూప్ ఆఫ్ కంపెనీలు స్థాపించారు. ప్రస్తుతం ఛైర్మన్, ఎండీగా వ్యవహరిస్తున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి నుంచి ఆర్గానిక్ కెమిస్ట్రీలో పీహెచ్డీ సాధించారు. #CONGRATULATIONS