News February 6, 2025

ఉమ్మడి MBNR జిల్లాలో రైతు భరోసా జమ.!

image

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో రైతు భరోసా నిధులు జమ అవుతున్నాయి. ఈ రోజు మహబూబ్ నగర్ జిల్లాకు 78,403 రైతులకు గాను రూ.38,15,09,916 జమయ్యాయి. NRPTకు 45,717 రైతులకు గాను రూ.26,94,06,431, NGKLకు 78,490 రైతులకు గాను రూ.44.79.99.371 జమయ్యాయి. వనపర్తి జిల్లాకు 60,239 రైతులకు గాను రూ.28,02,01,581, గద్వాలకు 37,352 రైతులకు గాను రూ.23,86,06,138 అధికారులు జమ చేశారు.

Similar News

News November 27, 2025

అమలాపురంలో 29న దివ్యాంగులకు క్రీడా పోటీలు

image

ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈనెల 29న అమలాపురం బాలయోగి స్టేడియంలో ప్రత్యేక క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి వైకుంఠరావు రుద్ర తెలిపారు. ఇందులో బ్యాడ్మింటన్, చెస్, క్యారమ్స్, వాలీబాల్ పోటీలు ఉంటాయన్నారు. ముఖ్యంగా బ్యాడ్మింటన్ పోటీలను అండర్-17 సబ్ జూనియర్, సీనియర్ విభాగాల్లో నిర్వహిస్తామని, ఆసక్తిగల క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

News November 27, 2025

NTR: ఈ సమస్యలను పట్టించుకోండి కలెక్టర్ సాబ్..!

image

ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్‌గా లక్ష్మీశ పదవీ బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయింది. ఈ ఏడాదిలో అనేక సమస్యలు పరిష్కరించినా, ప్రధాన సమస్యలపై మాత్రం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని పలువురు చెబుతున్నారు. ఫుడ్ కోర్ట్ నాణ్యత, తిరువూరు కిడ్నీ బాధితుల నీటి సరఫరా ఆలస్యం, ఆటోనగర్‌ కాలుష్యం, రెవెన్యూ సమస్యల పరిష్కారంలో వేగం పెంచాలి. ముఖ్యంగా టూరిజం అభివృద్ధిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

News November 27, 2025

చరిత్ర సృష్టించిన నిఖత్ జరీన్

image

ఇండియన్ స్టార్ బాక్సర్‌ నిఖత్ జరీన్ మరోసారి తన ప్రతిభతో ప్రపంచాన్ని ఆకట్టుకుంది. తాజా వరల్డ్ బాక్సింగ్ కప్ ఫైనల్స్ 2025లో స్వర్ణం గెలిచారు నిఖత్. పారిస్ ఒలింపిక్స్ తర్వాత విరామం తీసుకున్న నిఖత్, తిరిగి రింగ్‌లో అడుగుపెట్టి తన పంచ్ పవర్‌తో ప్రత్యర్థులను చిత్తు చేసింది. దాదాపు 21 నెలల తర్వాత అంతర్జాతీయ వేదికపై నిఖత్ పతకం సాధించడం విశేషం. ఈ మెడల్ భారత మహిళా బాక్సింగ్‌లో మరో మైలురాయిగా నిలిచింది.