News January 26, 2025

ఉయ్యూరు: యువకుడిపై పొక్సో కేసు నమోదు

image

ఉయ్యూరు పట్టణంలో నివసిస్తున్న మైనర్ బాలికపై గుడివాడకు చెందిన కొడాలి నాగబాబు అత్యాచారం చేయడంతో అతనిపై ఉయ్యూరు పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన మైనర్ బాలికను అపహరించి పలుమార్లు అత్యాచారం చేయడంతో బాధిత మహిళ తప్పించుకొని తల్లిదండ్రులకు జరిగిన విషయం చెప్పింది. వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు విచారించి యువకుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

Similar News

News March 14, 2025

సిద్దిపేట: మార్చిలోనే మండుతున్న ఎండలు

image

సిద్దిపేట జిల్లాలో ఎండలు మండుతున్నాయి. జిల్లాలో 36 డిగ్రీల పైగా ఉష్ణోగ్రతలు నమోదువుతున్నాయి. దీంతో నిప్పుల కొలిమిని తలపిస్తుండటంతో మధ్యాహ్నం సమయంలో బయటకు రావాలంటేనే జంకుతున్నారు. దీంతో రోడ్డు నిర్మానుష్యంగా మారుతున్నాయి. మార్చిలోనే ఎండలు ఇలా ఉంటే వచ్చే ఎప్రిల్, మేలో పరిస్థితి ఎలా ఉంటుందో అని ప్రజలు భయపడుతున్నారు. ఎండలో వెళ్లే వారు జాగ్రత్తలు పాటించాలని వైద్యులు చెబుతున్నారు.

News March 14, 2025

నాని కేరాఫ్ నయా టాలెంట్

image

నాని హీరోగా తన మార్కు చాటుతూనే నిర్మాతగా అవతారమెత్తారు. కొత్త వారికి అవకాశమిస్తూ సూపర్ హిట్లు ఖాతాలో వేసుకుంటున్నారు. అ!, హిట్, హిట్-2 సినిమాలే దీనికి ఉదాహరణ. తాజాగా ఆ జాబితాలోకి కోర్టు మూవీ చేరిందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రశాంత్ వర్మ, శైలేశ్ కొలను, తాజాగా కోర్టు సినిమాతో రామ్ జగదీశ్‌ వంటి దర్శకులను పరిచయం చేశారు. దీంతో నయా టాలెంట్‌ను ఎంకరేజ్ చేయడంలో నాని ముందుంటారని అంటున్నారు.

News March 14, 2025

రాజమండ్రి: గోదావరి నదిలో దూకి దంపతుల ఆత్మహత్య

image

రాజమండ్రి వద్ద గోదావరిలో దూకి దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. కాకినాడ నగరం తూరంగి డ్రైవర్స్ కాలనీకి చెందిన భార్యభర్తలు కాళ్ల వెంకట రమణ, వరలక్ష్మిగా పోలీసులు గుర్తించారు. స్థానిక మార్కండేయ స్వామి ఆలయం ఘాట్ వద్ద ఈ ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. ఆర్థిక ఇబ్బందులతో చనిపోతున్నట్లు సూసైడ్ నోట్‌ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాలను వెలికితీసి, పోస్టుమార్టానికి తరలించారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

error: Content is protected !!