News January 29, 2025
ఉరవకొండలో ఉద్యోగం పేరుతో రూ.23 లక్షలు స్వాహా

ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి రూ.23 లక్షలు తీసుకుని ఓ ఆగంతకుడు మహిళను మోసం చేశాడు. సోషల్ మీడియాలో పరిచయమైన ఆ వ్యక్తి బ్యాంకులో టెలికాలర్ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి నమ్మబలికాడు. ఆమె మొదట కొంత నగదు ఆ వ్యక్తి ఖాతాకు జమచేసింది. ఆమెను నమ్మించేందుకు అతను ఆ మహిళ ఖాతాకు తిరిగి నగదు వేశాడు. ఆ తర్వాత పూర్తిగా నమ్మిన ఆ మహిళ 2 బ్యాంకు ఖాతాల నుంచి రూ.23 లక్షలు పంపి మోసపోయింది. స్థానిక PSలో కేసు నమోదైంది.
Similar News
News November 17, 2025
ప్రణాళికలు సిద్ధం చేయండి: వరంగల్ మేయర్

ప్రతి రోజు 100 టన్నుల తడి చెత్త సేకరణే లక్ష్యంగా శానిటేషన్ సిబ్బంది పని చేయాల్సిన అవసరం ఉందని నగర మేయర్ గుండు సుధారాణి అన్నారు. బాల సముద్రంలో బల్దియా నిర్వహిస్తున్న వర్మీ కంపోస్ట్ యూనిట్లో బయో కంపోస్టు ప్రక్రియలో భాగంగా ఏర్పాటు చేసిన ట్రయల్ రన్ను కమిషనర్ చాహత్ బాజ్ పాయ్తో కలిసి మేయర్ పరిశీలించారు. ఐదు బయో కంపోస్టు యూనిట్ల ఏర్పాటుకు టెండర్ అవార్డ్ చేశామన్నారు.
News November 17, 2025
ప్రణాళికలు సిద్ధం చేయండి: వరంగల్ మేయర్

ప్రతి రోజు 100 టన్నుల తడి చెత్త సేకరణే లక్ష్యంగా శానిటేషన్ సిబ్బంది పని చేయాల్సిన అవసరం ఉందని నగర మేయర్ గుండు సుధారాణి అన్నారు. బాల సముద్రంలో బల్దియా నిర్వహిస్తున్న వర్మీ కంపోస్ట్ యూనిట్లో బయో కంపోస్టు ప్రక్రియలో భాగంగా ఏర్పాటు చేసిన ట్రయల్ రన్ను కమిషనర్ చాహత్ బాజ్ పాయ్తో కలిసి మేయర్ పరిశీలించారు. ఐదు బయో కంపోస్టు యూనిట్ల ఏర్పాటుకు టెండర్ అవార్డ్ చేశామన్నారు.
News November 17, 2025
జనరల్ బాడీ సమావేశాలు ఏర్పాటు చేయాలి: వరంగల్ మేయర్

వరంగల్ పరిధిలో గల మహిళా సమైక్య సంఘాలు జనరల్ బాడీ సమావేశాలు ఏర్పాటు చేయాలని నగర మేయర్ గుండు సుధారాణి అన్నారు. సోమవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో అమృత్ మిత్ర పథకంలో భాగంగా మెప్మా, హార్టికల్చర్ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మేయర్ పాల్గొని సమర్థవంతంగా చేపట్టేందుకు తగు సూచనలు చేశారు. అమృత్ మిత్ర పథకంలో భాగంగా మెప్మాతోపాటు హార్టికల్చర్ వారు సమన్వయం చేసుకుంటూ వెళ్లాలన్నారు.


