News January 29, 2025
ఉరవకొండలో ఉద్యోగం పేరుతో రూ.23 లక్షలు స్వాహా

ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి రూ.23 లక్షలు తీసుకుని ఓ ఆగంతకుడు మహిళను మోసం చేశాడు. సోషల్ మీడియాలో పరిచయమైన ఆ వ్యక్తి బ్యాంకులో టెలికాలర్ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి నమ్మబలికాడు. ఆమె మొదట కొంత నగదు ఆ వ్యక్తి ఖాతాకు జమచేసింది. ఆమెను నమ్మించేందుకు అతను ఆ మహిళ ఖాతాకు తిరిగి నగదు వేశాడు. ఆ తర్వాత పూర్తిగా నమ్మిన ఆ మహిళ 2 బ్యాంకు ఖాతాల నుంచి రూ.23 లక్షలు పంపి మోసపోయింది. స్థానిక PSలో కేసు నమోదైంది.
Similar News
News February 25, 2026
NZB: ప్రభుత్వ మెడికల్ కాలేజ్లో ఏడుగురు అసిస్టెంట్ ప్రొఫెసర్ల తొలగింపు

ఏడాదికి పైగా అనధికారికంగా విధులకు గైర్హాజరవుతున్న NZB ప్రభుత్వ మెడికల్ కాలేజ్కు చెందిన ఏడుగురు అసిస్టెంట్ ప్రొఫెసర్లను విధుల నుంచి తొలగిస్తూ వైద్య విద్య సంచాలకుడు (DME) నరేంద్ర కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. డా.అయేషా ఫరీన్, డా.G.స్రవంతి, డా.P.నిశిత, డా.నీలకంఠం సతీశ్ రాజు, డా.R.లక్ష్మణ్, డా.M.అపూర్వ, Dr.P.లీలావతిలను తొలగిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
News February 25, 2026
NRPT: పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన డీఎస్పీ

ఇంటర్ వార్షిక పరీక్షల నేపథ్యంలో బుధవారం నారాయణపేట పట్టణంలోని గురుకుల పాఠశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాలను డీఎస్పీ లింగయ్య తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణ తీరును, భద్రతను సమీక్షించారు. పోలీసులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సెల్ఫోన్లు, ఇతర ఎలెక్ట్రానిక్ పరికరాలను పరీక్ష కేంద్రంలోకి అనుమతించరాదని అన్నారు. ప్రశాంత వాతావరణంలో పరీక్షలు జరిగేలా చూడాలని అన్నారు.
News February 25, 2026
2 నుంచి శ్రీవారి కానుక వస్త్రాల వేలం

తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు TTD అనుబంధ దేవస్థానాలకు భక్తులు సమర్పించిన వస్త్రాలు(మొత్తం 287 లాట్లు) ఆన్లైన్ ఈ-వేలానికి ఉంచుతున్నారు. ఆర్ట్ సిల్క్ చీరలు, హాఫ్ శారీస్, సిల్క్ చీరలు, ఆర్డినరీ చీరలకు మార్చి 2వ తేదీ 9వ తేదీ వరకు AP ఈ-కొనుగోలు పోర్టల్లో EA ID Nos. 25597–25602, 25604–25609 ద్వారా వేలం జరుగుతుంది. ఆసక్తి ఉన్నవారు AP ఈ-ప్రొక్యూర్మెంట్ పోర్టల్లో నమోదు చేసుకోవాలి.


