News January 29, 2025
ఉరవకొండలో ఉద్యోగం పేరుతో రూ.23 లక్షలు స్వాహా

ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి రూ.23 లక్షలు తీసుకుని ఓ ఆగంతకుడు మహిళను మోసం చేశాడు. సోషల్ మీడియాలో పరిచయమైన ఆ వ్యక్తి బ్యాంకులో టెలికాలర్ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి నమ్మబలికాడు. ఆమె మొదట కొంత నగదు ఆ వ్యక్తి ఖాతాకు జమచేసింది. ఆమెను నమ్మించేందుకు అతను ఆ మహిళ ఖాతాకు తిరిగి నగదు వేశాడు. ఆ తర్వాత పూర్తిగా నమ్మిన ఆ మహిళ 2 బ్యాంకు ఖాతాల నుంచి రూ.23 లక్షలు పంపి మోసపోయింది. స్థానిక PSలో కేసు నమోదైంది.
Similar News
News November 17, 2025
తిరుచానూరులో శ్రీవారు తపస్సు చేశారని తెలుసా?

తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి పద్మసరోవరానికి తూర్పువైపున శ్రీసూర్య నారాయణ స్వామివారి ఆలయం ఉంటుంది. శ్రీనివాసుడు స్వయంగా సూర్య స్వామిని ఇక్కడ ప్రతిష్ఠించి మహాలక్ష్మీ కోసం తపస్సు చేశారు. 12 ఏళ్ల తర్వాత బంగారు పద్మంలో అమ్మవారు ఆవిర్భవించారు. ఈ ఆలయంలో వైఖానస ఆగమం ప్రకారం పూజలు నిర్వహిస్తారు. ఈ ఆలయాన్ని అనేకసార్లు పునరుద్ధరించారు. 1866 ఏప్రిల్ 23న హథీరాంజీ మఠం వారు జీర్ణోద్ధరణ చేశారు.
News November 17, 2025
వరంగల్: డా.చిట్టిబాబు ఇంటిపై సోదాలు

వరంగల్ జిల్లా ఖానాపురం(M)లో అర్షమొల ఆపరేషన్ వికటించిన ఘటనపై దర్యాప్తు వేగం పెంచిన అధికారులు, ఖానాపురంలో నకిలీ వైద్యుడు బైరూ చిట్టిబాబు ఇంటిపై సోదాలు నిర్వహించారు. ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన డైక్లోఫెనాక్, జెంటమైసిన్, డెక్సామెతాసోన్ సహా పలు ఇంజెక్షన్లు, పాత శస్త్రపరికరాలను స్వాధీనం చేసుకున్నారు. అర్హత లేకుండా చికిత్సలు చేస్తున్న చిట్టిబాబుపై కేసులు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.
News November 17, 2025
ఒకేసారి రెండు సీక్వెల్స్లో తేజా సజ్జ!

హనుమాన్, మిరాయ్ సినిమాలతో పాన్ ఇండియా హీరోగా మారిన తేజా సజ్జ మరో 2 చిత్రాలను లైన్లో పెట్టారు. జాంబిరెడ్డి, మిరాయ్ మూవీల సీక్వెల్స్ను సమాంతరంగా పూర్తిచేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ ప్రాజెక్టుల ప్రీప్రొడక్షన్ పనులు పూర్తయినట్లు సమాచారం. జనవరిలో జాంబిరెడ్డి-2, మార్చిలో మిరాయ్-2ను సెట్స్పైకి తీసుకెళ్తారని టాక్. ఈ సినిమాలను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించనుంది.


