News January 29, 2025
ఉరవకొండలో ఉద్యోగం పేరుతో రూ.23 లక్షలు స్వాహా

ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి రూ.23 లక్షలు తీసుకుని ఓ ఆగంతకుడు మహిళను మోసం చేశాడు. సోషల్ మీడియాలో పరిచయమైన ఆ వ్యక్తి బ్యాంకులో టెలికాలర్ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి నమ్మబలికాడు. ఆమె మొదట కొంత నగదు ఆ వ్యక్తి ఖాతాకు జమచేసింది. ఆమెను నమ్మించేందుకు అతను ఆ మహిళ ఖాతాకు తిరిగి నగదు వేశాడు. ఆ తర్వాత పూర్తిగా నమ్మిన ఆ మహిళ 2 బ్యాంకు ఖాతాల నుంచి రూ.23 లక్షలు పంపి మోసపోయింది. స్థానిక PSలో కేసు నమోదైంది.
Similar News
News December 10, 2025
ఆదిలాబాద్: తెర వెనుక రాజకీయం షురూ

ఉమ్మడి జిల్లాలో గురువారం జరగనున్న తొలి విడత పంచాయతీ ఎన్నికలకు ప్రచారం గడువు మంగళవారం సాయంత్రంతో ముగిసింది. బహిరంగ ప్రచార పర్వం ముగియడంతో అభ్యర్థులు ఇప్పుడు తెర వెనుక రాజకీయాలకు పదును పెట్టారు. ఓటర్లను ఆకర్షించేందుకు వ్యూహాలు రచిస్తూ, గ్రామాల్లోని కీలక కుల సంఘాల పెద్దలను, ముఖ్య నాయకులను కలుస్తున్నారు. తమకు ఓటు వేసి ఆశీర్వదించాలని కోరుతూ, మద్దతు కూడగట్టుకునే ప్రయత్నాల్లో అభ్యర్థులు నిమగ్నమయ్యారు.
News December 10, 2025
మన్యం: బాబోయ్ వణుకు..!

పాచిపెంటలోని పలు ప్రాంతాల్లో చలి తీవ్రత పెరగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మూడు రోజులుగా రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోవడంతో సాయంత్రం 4 దాటిన తరువాత చలి తీవ్రత పెరిగి చలి మంటలు వేసుకుంటూ రక్షణ పొందుతున్నారు. ఉదయం పూట మంచు అధికంగా పడటంతో 7 గంటలు దాటితే గానీ ప్రజలు బయటకు రాలేకపోతున్నారు. చిన్న పిల్లలు, వృద్ధులు అప్రమత్తంగా ఉండాలని వైద్యలు హెచ్చరిస్తున్నారు. మరి మీ ప్రాంతంలో ఎలా ఉంది? కామెంట్
News December 10, 2025
గాయపడిన సింహం.. తిరిగొచ్చి అదరగొట్టింది!

‘గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస గర్జనకన్నా భయంకరంగా ఉంటుంది’ అనే డైలాగ్ హార్దిక్ పాండ్యకు సరిగ్గా సరిపోతుంది. గాయం నుంచి కోలుకుని SAతో తొలి T20లో రీఎంట్రీ ఇచ్చిన అతడు 28 బంతుల్లో 59* రన్స్ చేశారు. ఓవైపు ఇతర బ్యాటర్లు వికెట్ కాపాడుకునేందుకే అవస్థలు పడుతుంటే పాండ్య మాత్రం కామ్&కంపోజ్డ్ షాట్లతో విరుచుకుపడ్డారు. బౌలింగ్లోనూ తొలి బంతికే వికెట్ తీశారు. ఇరు జట్లలో వేరే ఏ ఆటగాడు 30+ స్కోర్ చేయలేదు.


