News January 29, 2025
ఉరవకొండలో ఉద్యోగం పేరుతో రూ.23 లక్షలు స్వాహా

ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి రూ.23 లక్షలు తీసుకుని ఓ ఆగంతకుడు మహిళను మోసం చేశాడు. సోషల్ మీడియాలో పరిచయమైన ఆ వ్యక్తి బ్యాంకులో టెలికాలర్ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి నమ్మబలికాడు. ఆమె మొదట కొంత నగదు ఆ వ్యక్తి ఖాతాకు జమచేసింది. ఆమెను నమ్మించేందుకు అతను ఆ మహిళ ఖాతాకు తిరిగి నగదు వేశాడు. ఆ తర్వాత పూర్తిగా నమ్మిన ఆ మహిళ 2 బ్యాంకు ఖాతాల నుంచి రూ.23 లక్షలు పంపి మోసపోయింది. స్థానిక PSలో కేసు నమోదైంది.
Similar News
News November 19, 2025
భద్రకాళి ఆలయ హుండీ ఆదాయం రూ. 65.93 లక్షలు

వరంగల్ శ్రీ భద్రకాళి దేవస్థానంలో బుధవారం హుండీలు విప్పి లెక్కింపు చేశారు. ఈ లెక్కింపులో మొత్తం రూ. 65,93,481 ఆదాయం వచ్చింది. వీటితో పాటు 2483 యూఎస్ఏ డాలర్లు, 55 ఆస్ట్రేలియా డాలర్లు సహా ఇతర విదేశీ కరెన్సీలు లభించాయి. హుండీలో వచ్చిన మిశ్రమ బంగారం, వెండిని తిరిగి హుండీలో వేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో, అధికారులు, ధర్మకర్తలు పాల్గొన్నారు.
News November 19, 2025
ఆసిఫాబాద్లో రేపు మినీ జాబ్ మేళా

ఈ నెల 20న పాత కలెక్టర్ కార్యాలయం జనకాపూర్లో ఉదయం 10.30 గంటలకు TASK TRAINING CENTRE ఆధ్వర్యంలో మినీ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి రవికృష్ణ తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ జాబ్ మేళాలో పాల్గొని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
News November 19, 2025
ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీతో సింగరేణి సంస్థ కీలక ఒప్పందం

సింగరేణి సంస్థ పునరుద్పాదక ఇంధన రంగంలో విద్యుత్ ప్రాజెక్టులను పెద్ద ఎత్తున చేపట్టబోతోంది. ఇందులో భాగంగా గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల నిర్మాణం, విద్యుత్ అమ్మకంలో సహకారానికి ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్తో కీలక ఒప్పందం కుదుర్చుకుంది. హైదరాబాద్లో జరిగిన ఒప్పంద కార్యక్రమంలో సింగరేణి సీఎండీ బలరామ్, డైరెక్టర్లు, ఎన్జీఈఎల్ ఉన్నతాధికారులు మౌర్య, బిమల్ గోపాల చారి పాల్గొన్నారు.


