News January 29, 2025

ఉరవకొండ: ‘అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలి’

image

ఉరవకొండ నియోజకవర్గంలో గ్రామీణ రహదారుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం అనంతపురం నగరంలోని ఆర్.అండ్.బి అతిథి గృహంలో ఉరవకొండ నియోజకవర్గంలో పంచాయతీరాజ్ ఆధ్వర్యంలోని గ్రామీణ రహదారుల అభివృద్ధిపై సంబంధిత అధికారులతో మంత్రి పయ్యావుల కేశవ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలో రోడ్ల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

Similar News

News November 24, 2025

టెన్త్ ఫెయిల్ అయిన విద్యార్థులకు DEO శుభవార్త

image

గతంలో టెన్త్ క్లాస్ ఫెయిల్ అయి తిరిగి పరీక్షలు రాసే అవకాశం లేక మధ్యలో చదువు ఆపేసిన విద్యార్థుల కోసం సార్వత్రిక విద్యాపీఠం మంచి అవకాశాన్ని కల్పించినట్లు DEO ప్రసాద్ బాబు తెలిపారు. అలాంటి విద్యార్థులు అడ్మిషన్ ఫీజు కింద రూ.300 మాత్రమే చెల్లించి ఏపీ విద్యాపీఠం www.apopenschool.ap.gov.in వైబ్ సెట్ దరఖాస్తు చేసుకోవాలని ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

News November 24, 2025

నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక: కలెక్టర్

image

అనంతపురం కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆనంద్ చెప్పారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. తమ సమస్యలు పరిష్కారం కానివారు కాల్ సెంటర్ 1100ను సంప్రదించాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరుగుతుందన్నారు. జిల్లా ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News November 24, 2025

నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక: కలెక్టర్

image

అనంతపురం కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆనంద్ చెప్పారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. తమ సమస్యలు పరిష్కారం కానివారు కాల్ సెంటర్ 1100ను సంప్రదించాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరుగుతుందన్నారు. జిల్లా ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు.