News January 29, 2025
ఉరవకొండ: ‘అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలి’

ఉరవకొండ నియోజకవర్గంలో గ్రామీణ రహదారుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం అనంతపురం నగరంలోని ఆర్.అండ్.బి అతిథి గృహంలో ఉరవకొండ నియోజకవర్గంలో పంచాయతీరాజ్ ఆధ్వర్యంలోని గ్రామీణ రహదారుల అభివృద్ధిపై సంబంధిత అధికారులతో మంత్రి పయ్యావుల కేశవ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలో రోడ్ల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
Similar News
News February 16, 2025
అనంత: సేవాగడ్లో డోలు, కత్తి పట్టిన కలెక్టర్

గుత్తి మండలం చెర్లోపల్లి సేవాఘడ్లోని శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ను శనివారం అనంత ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ, కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ దర్శించుకున్నారు. స్వామివారి తీర్థ ప్రసాదాలు అందుకున్నారు. అనంతరం కలెక్టర్కు ఆలయ కమిటీ సభ్యులు డోలు, కత్తిని అందించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ ఉత్సవాలను లోకల్ ఫెస్టివల్గా నిర్వహించాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారని తెలిపారు.
News February 16, 2025
JNTUలోని మెకానికల్ ప్రొఫెసర్లను అభినందించిన ప్రిన్సిపల్

అనంతపురం JNTUలోని మెకానికల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్లు కళ్యాణి రాధ, ఓం ప్రకాశ్ను శనివారం ప్రిన్సిపల్ చెన్నారెడ్డి అభినందించారు. NIT-Rలో ఫిబ్రవరి 7 నుంచి 9 వరకు నిర్వహించిన ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లో వారు ప్రదర్శించిన టెక్నికల్ పేపర్ మీద వారికి NIT-R నుంచి సర్టిఫికెట్, అవార్డులు లభించాయి. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ చెన్నారెడ్డి మాట్లాడుతూ.. రానున్న రోజులలో మరిన్ని అవార్డులు సాధించాలని ఆకాంక్షించారు.
News February 15, 2025
ఈనెల 17న రాయదుర్గంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక: కలెక్టర్

ఫిబ్రవరి 17న రాయదుర్గం పట్టణంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు అనంతపురం కలెక్టర్ వినోద్ కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ మాట్లాడుతూ.. ఈ నెల 17న ఉదయం 9 గంటలకు ఏపిడి డ్వామా కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ప్రజల నుంచి అభ్యర్థనలు స్వీకరిస్తామని పేర్కొన్నారు.