News March 27, 2025
ఉరేసుకుని వివాహిత ఆత్మహత్య?

సత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలంలోని బ్రహ్మేశ్వరంపల్లిలో మహిళ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మండల పరిధిలోని మొరసలపల్లికి చెందిన అర్చనను బ్రహ్మేశ్వరం పల్లి గ్రామానికి చెందిన శివశంకర్ వివాహం చేసుకున్నాడు. వారికి కూతురు, కుమారుడు ఉన్నారు. ఈ క్రమంలో ఆమె బలవన్మరణానికి పాల్పడటం పలు అనుమానాలకు తావిస్తోంది. తమ కుమార్తెను అత్తింటి వారే చంపారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Similar News
News January 8, 2026
నాన్న ఛాతీనే ❤️ పట్టుపాన్పు

భక్తుల శరణుఘోషలు, విపరీతమైన చలి.. ఇవేమీ లెక్కచేయకుండా నాన్న ఛాతీపై హాయిగా నిద్రపోతున్న కన్నెస్వామి ఫొటో వైరలవుతోంది. తండ్రితో కలిసి ఆ మణికంఠుడిని దర్శించుకుని ఈ చిన్నారి అలసిపోయింది. నాన్న గుండెచప్పుడే గుడి గంటలుగా, ఆయన ఒడే పట్టుపాన్పుగా, ప్రపంచంలోనే సురక్షిత ప్రదేశంగా భావించి నిద్రపోయింది. ఆ తండ్రి కూడా బిడ్డ నిద్రకు భంగం కలిగించకుండా కదలకుండా ఉండిపోయాడు. ఎంతైనా అమ్మాయికి తండ్రే కదా సూపర్ హీరో.
News January 8, 2026
HYDలో నేను ఎక్కడ నడవాలి? చెప్పండి ప్లీజ్!

‘నాకు కారులేదు. బండి లేదు. సైకిల్ కూడా లేదు. అందుకే నేను నడుచుకుంటూ వెళ్లాలి. మరి ఎలా వెళ్లాలి? మహానగరంలో ఎక్కడ చూసినా రోడ్లే. నేను నడవాలంటే రోడ్లపై నడవాల్సిందేనా? సిటీలో దాదాపు 10వేల KM రోడ్లు ఉంటే నడవడానికి 550 KM ఫుట్పాత్ ఉంది. ఇదేం పద్ధతి? ఎక్కడ చూసినా ఆక్రమణలే.. వ్యాపారులు, సామగ్రి, పాన్ డబ్బాలు ఆక్రమించాయి? నేను నడిచేందుకు దారి చూపించండి సార్.. అంటూ ఓ నగరవాసి చేసిన విన్నపం ఇది.
News January 8, 2026
పసుపు పంట కోత – ఈ జాగ్రత్తలు తీసుకోవాలి

పసుపు తవ్వడానికి 2 రోజుల ముందే మొక్క ఆకులు, కాండాలను భూమట్టానికి కోయాలి. తర్వాత తేలికపాటి నీటి తడిని ఇచ్చి 2 రోజుల తర్వాత నుంచి పసుపు తవ్వకం ప్రారంభించాలి. తవ్వగా ఇంకా దుంపలు భూమిలో మిగిలిపోతే నాగలితో దున్ని ఏరాలి. పంటను తీసేటప్పుడు కొమ్ములకు దెబ్బ తగలకుండా చూసుకోవాలి. పసుపు దుంపలను ఏరాక మట్టిని తొలగించాలి. తర్వాత తల్లి, పిల్ల దుంపలు వేరుచేసి, తెగుళ్లు ఆశించిన దుంపలను పక్కకు తీసేయాలి.


