News March 27, 2025

ఉరేసుకుని వివాహిత ఆత్మహత్య?

image

సత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలంలోని బ్రహ్మేశ్వరంపల్లిలో మహిళ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మండల పరిధిలోని మొరసలపల్లికి చెందిన అర్చనను బ్రహ్మేశ్వరం పల్లి గ్రామానికి చెందిన శివశంకర్ వివాహం చేసుకున్నాడు. వారికి కూతురు, కుమారుడు ఉన్నారు. ఈ క్రమంలో ఆమె బలవన్మరణానికి పాల్పడటం పలు అనుమానాలకు తావిస్తోంది. తమ కుమార్తెను అత్తింటి వారే చంపారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Similar News

News December 10, 2025

విశాఖ జిల్లాలో 2 కీలక పోస్టులు ఖాళీ

image

విశాఖలో రెగ్యులర్ అధికారుల‌ను నియ‌మించ‌డంలో ప్ర‌భుత్వం మీన‌మేషాలు లెక్కిస్తోంది. DRO, RDOల మ‌ధ్య వివాదం జరగ్గా.. ఇద్ద‌రినీ స‌రెండ‌ర్ చేశారు. 2 నెల‌లు కావొస్తున్నా ఇప్ప‌టి వ‌ర‌కు రెగ్యుల‌ర్ అధికారుల‌ను నియ‌మించ‌లేదు. ఇన్‌ఛార్జ్ హోదాల్లో ఉన్నవారు పెద్ద‌ పెద్ద ప‌నుల విష‌యంలో త‌ల‌దూర్చడం లేదు. తాత్కాలిక‌మైన ప‌నుల‌నే చూసుకొని వెళ్లిపోతున్నారు. దీంతో కీల‌క‌ నిర్ణ‌యాల విష‌యంలో ఇబ్బందులు త‌లెత్తుతున్నాయి.

News December 10, 2025

అనకాపల్లి: పిల్లలను దత్తత తీసుకునేవారు నిబంధనలు పాటించాలి

image

పిల్లలను దత్తత తీసుకోవడానికి ముందుకు వచ్చేవారు నిబంధనలు పాటించాలని డీఎం అండ్ హెచ్ఓ డాక్టర్ హైమావతి సూచించారు. మంగళవారం అనకాపల్లి మండలం తుంపాలలో మాట్లాడుతూ ముందుగా మిషన్ వాత్సల్య వెబ్ సైట్ లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నారు. దత్తతకు సంబంధించి ఫ్యామిలీ ఫోటో నివాస ఆదాయ వివాహ తదితర ధ్రువపత్రాలను సమర్పించాలన్నారు. దత్తత తీసుకునే సమయంలో రూ.50 వేలు డీడీ రూపంలో చెల్లించాలన్నారు.

News December 10, 2025

అమరావతి నిర్మాణం ఆగకుండా మెటీరియల్!

image

AP: అమరావతిలో నిర్మాణ పనులు ఆగకుండా మెటీరియల్ సరఫరా చేసే నిమిత్తం 4 జిల్లాల అధికారులకు ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. గ్రావెల్, రోడ్ మెటల్, మట్టి, ఇసుక సరఫరాలో సమస్యలున్న నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. కలెక్టర్ అధ్యక్షతన ఈ అధికారులు కమిటీగా ఏర్పడి మెటీరియల్ డిమాండ్, సరఫరా వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటారు. సరఫరాలో అడ్డంకులను తొలగించడం, అనుమతులు ఇప్పించడంలో కమిటీ బాధ్యత వహిస్తుంది.