News March 13, 2025

ఉష్ణోగ్రతల దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలి: గంగాధర్

image

జిల్లాలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా ఎండలో పనిచేసే వారు వడదెబ్బకు గురికాకుండా తగిన చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్ గంగాధర్ అధికారులను ఆదేశించారు. భువనగిరిలో ఆరోగ్యశాఖ అధ్వర్యంలో ముద్రించిన పోస్టర్ అవిష్కరించి మాట్లాడారు. రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా ప్రజలు, నేరుగా సూర్యకిరణాలు తాకే స్థలాల్లో పనిచేసే వారు వడదెబ్బకు గురికాకుండా నివారణ చర్యలు చేపట్టాలన్నారు.

Similar News

News March 14, 2025

ఆదిలాబాద్: వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్

image

విద్యా శాఖ కార్యదర్శి (FLN) విద్యార్థుల్లో అభ్యాస సామర్థ్యాలను బలోపేతం చేసే అంశంపై గురువారం అన్ని జిల్లాల కలెక్టర్లతో, విద్యాధికారులతో, నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ రాజర్షి షా పాల్గొన్నారు. AI ఆధారిత పరిజ్ఞానంతో ప్రభుత్వ పాఠశాలల్లో చదువులో వెనుకబడి ఉన్న విద్యార్ధులకు సులువుగా శ్రద్ధతో చదవడానికి పైలట్ ప్రాజెక్ట్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని తెలిపారు.

News March 14, 2025

చందుర్తి: చిన్నారి వామిక ఇక లేదు

image

చందుర్తి మండల కేంద్రానికి చెందిన మర్రి వామిక (16 నెలలు) అనే చిన్నారి చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతి చెందింది. వామిక గత పది రోజుల నుంచి బ్లడ్ ఇన్ఫెక్షన్‌తో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. వామికను బతికించడం కోసం దాతలు ముందుకు వచ్చి విరాళాలు అందజేశారు. అయినా వామిక బతకలేదు. చిన్నారి మృతితో కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు.

News March 14, 2025

పల్నాడు: రేపటి నుంచి ఒంటి పూట బడులు

image

పల్నాడు జిల్లాలో రేపటి నుంచి ఒంటిపూట బడులను అమలు చేస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారిణిచంద్రకళ శుక్రవారం తెలిపారు. ఏప్రిల్ 23 వరకు ప్రభుత్వ, ప్రైవేటు బడుల్లో ఉదయం 7:45 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు తరగతులు జరుగుతాయన్నారు. 10వ తరగతి పరీక్షలు జరిగే పాఠశాలల్లో పరీక్షలు ముగిసే వరకు మధ్యాహ్నం 1:15 నుంచి 5 గంటల వరకు తరగతులు జరుగుతాయన్నారు. కచ్చితంగా ప్రైవేటు పాఠశాలల్లో ఒంటిపూట బడులు అమలు చేయాలన్నారు.

error: Content is protected !!