News February 4, 2025
ఊట్కూర్: గ్రామ దేవత ఊర లక్ష్మమ్మ ఆలయంలో చోరీ

ఊట్కూరు మండల కేంద్రంలోని గ్రామదేవత ఊర లక్ష్మమ్మ ఆలయంలో సోమవారం రాత్రి చోరీ జరిగింది. స్థానికుల కథనం మేరకు.. అర్చకులు భీమయ్య నిత్య పూజలో భాగంగా ఈరోజు ఉదయం ఆలయానికి వచ్చి చూడగా, గుర్తుతెలియని వ్యక్తులు ప్రధాన ద్వారం తాళం విరగొట్టి ఆలయంలోకి చొరబడి 4 పెద్ద గంటలు, హారతి పళ్లెం, హుండీ, అమ్మవారి వెండి వస్తువులు, 5 దీప జ్యోతులు అపహరించినట్లు తెలిపారు.
Similar News
News March 15, 2025
షాకింగ్.. పెళ్లయిన వారిలోనే ఆ సమస్య ఎక్కువ

పెళ్లికి ముందుతో పోలిస్తే తర్వాతే మగవాళ్లు లావెక్కుతారని పొలాండ్లోని వార్సాకు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ పరిశోధకులు తేల్చారు. మహిళల్లో ఇది 39 శాతమే ఉంటుందని చెప్పారు. సింగిల్స్తో పోలిస్తే పెళ్లయిన పురుషుల్లో ఊబకాయం సమస్యను మూడు రెట్లు పెంచుతుందని అధ్యయనంలో తెలిపారు. తినే ఆహార పరిమాణం పెరగడం, శారీరక శ్రమ తగ్గడం వంటివి కారణాలుగా అభిప్రాయపడ్డారు.
News March 15, 2025
బుమ్రా తెలివిగా ఆలోచించాలి: మెక్గ్రాత్

గాయాల విషయంలో భారత బౌలర్ బుమ్రా తెలివిగా వ్యవహరించాలని ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ మెక్గ్రాత్ సూచించారు. ‘తను యువకుడు కాదు. వయసు పెరిగే కొద్దీ ఫాస్ట్ బౌలర్లకు గాయాల ప్రమాదం మరింత ఎక్కువ. నేను తక్కువ వేగంతో బౌలింగ్ చేసేవాడిని కాబట్టి పెద్ద ఇబ్బంది ఉండేది కాదు. కానీ బుమ్రా వంటి ఫాస్ట్ బౌలర్లు అప్రమత్తంగా ఉండాలి. జిమ్లో శరీరాన్ని దృఢపరచుకోవాలి. భారత్కు అతడి సేవలు అత్యవసరం’ అని పేర్కొన్నారు.
News March 15, 2025
VKB: అలర్ట్.. పిల్లలపై కన్నేసి ఉంచండి

వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా వేసవి తాపం నేపథ్యంలో నేటి నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయి. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు తరగతులు ఉంటాయి. ఒంటిపూట బడులు అంటే పిల్లలకు సరదా.. చెరువుల్లో, నీటి వనరుల వద్దకు వెళ్తుంటారు. చిన్నారులు నీట మునిగి మృత్యువాత పడిన ఘటనలు ఎన్నో జరిగాయి. చెరువులు, కుంటలు, బావులు నీటితో నిండి ఉన్నాయి. పిల్లల మీద పెద్దలు ఓ కన్నేసి ఉంచండి. SHARE IT..