News January 26, 2025
ఊట్కూర్: వ్యక్తి అదృశ్యం.. కుటుంబ సభ్యుల ఫిర్యాదు

ఊట్కూర్ మండల పరిధిలోని అవులోని పల్లి గ్రామానికి చెందిన వడ్ల లక్ష్మయ్య(32) అదృష్టమైనట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన వివరాలు.. నిన్న సాయంత్రం 4 గంటల ప్రాంతంలో లక్ష్మయ్య తన బట్టలను ఇస్త్రీ చేయించుకుని వస్తానని బయటికి వెళ్లి తిరిగి రాలేదు అని తెలిపారు. గ్రామంలో ఆరా తీసినా, ఇతర సమీప బంధువుల ఇళ్లలో ఎంత వెతికిన ఫలితం లేకపోయేసరికి భార్య తిమ్మమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Similar News
News February 28, 2026
WGL: వాళ్లు లోపల.. వీళ్లు బయట!

విధి విచిత్రం అంటే ఇదేనేమో. మావోయిస్టులకు సానుభూతి వ్యక్తం చేశారంటూ పౌరహక్కుల సంఘాల నేతలను అర్బన్ నక్సల్స్ అంటూ జైల్లో పెట్టారు. మావోయిస్టు అంత్యక్రియలకు హాజరైనందుకు గాదె ఇన్నారెడ్డి జైళ్లో ఉన్నారు. ఇటీవల ఆయన తల్లి చనిపోగా, <<19260305>>ఈరోజు తండ్రి సైతం <<>>మరణించారు. మరోపక్క అజ్ఞాతం వీడిన మాజీ మావోయిస్టు నేతలు సీఎం కార్యాలయంలో కుర్చీలపై కూర్చొని ఫొటోలు దిగుతున్నారు. దీన్ని చూసి ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు.
News February 28, 2026
MVRCలో ఉద్యోగాలు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

ముంబై రైల్వే వికాస్ కార్పొరేషన్ లిమిటెడ్(MVRC)లో 10 పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో BE/BTech, ME/MTech ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. స్క్రీనింగ్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://mrvc.indianrailways.gov.in
News February 28, 2026
క్యూబాను స్నేహపూర్వకంగా స్వాధీనం చేసుకుంటాం: ట్రంప్

వెనిజులా అధ్యక్షుడు మదురో అరెస్ట్, గ్రీన్లాండ్పై బెదిరింపుల తర్వాత US అధ్యక్షుడు ట్రంప్ కన్ను క్యూబాపై పడింది. ఆ దేశాన్ని స్నేహపూర్వకంగా స్వాధీనం చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. విదేశాంగ కార్యదర్శి రూబియో ఆ దేశ నాయకులతో చర్చలు జరుపుతున్నారన్నారు. ‘నేను చిన్నప్పటి నుంచి క్యూబా గురించి వింటున్నా. అదొక విఫల దేశం. డబ్బుల్లేక తీవ్ర ఇబ్బందుల్లో ఉంది. వారు మా సాయం కోరుకుంటున్నారు’ అని చెప్పారు.


