News January 26, 2025
ఊట్కూర్: వ్యక్తి అదృశ్యం.. కుటుంబ సభ్యుల ఫిర్యాదు

ఊట్కూర్ మండల పరిధిలోని అవులోని పల్లి గ్రామానికి చెందిన వడ్ల లక్ష్మయ్య(32) అదృష్టమైనట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన వివరాలు.. నిన్న సాయంత్రం 4 గంటల ప్రాంతంలో లక్ష్మయ్య తన బట్టలను ఇస్త్రీ చేయించుకుని వస్తానని బయటికి వెళ్లి తిరిగి రాలేదు అని తెలిపారు. గ్రామంలో ఆరా తీసినా, ఇతర సమీప బంధువుల ఇళ్లలో ఎంత వెతికిన ఫలితం లేకపోయేసరికి భార్య తిమ్మమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Similar News
News November 3, 2025
WCలో సత్తా చాటిన తెలుగమ్మాయి శ్రీ చరణి

భారత మహిళల జట్టు <<18182320>>వన్డే వరల్డ్<<>> కప్ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఈ టోర్నమెంట్లో కడపకు చెందిన శ్రీ చరణి అద్భుత ప్రదర్శనతో టీమ్ ఇండియా విజయాల్లో కీలక పాత్ర పోషించారు. మొత్తం 9 మ్యాచుల్లో 14 వికెట్లు తీసి అత్యధిక వికెట్స్ తీసిన నాలుగో బౌలర్గా నిలిచారు. తొలిస్థానంలో ఉన్న దీప్తీ శర్మ(22) తర్వాత ఇండియా నుంచి శ్రీ చరణి మాత్రమే టాప్ 10లో చోటు దక్కించుకోవడం విశేషం.
News November 3, 2025
HYD: ఘోరం.. ఉలిక్కపడ్డ మీర్జాగూడ

RTC బస్సు ప్రమాద ఘటనతో మీర్జాగూడ ఉలిక్కిపడింది. ఉ.6 గంటల వరకు అంతా ప్రశాంతంగా ఉంది. హైవే మీద ప్రమాదం జరిగిందని తెలుసుకున్న మీర్జాగూడ, ఇంద్రారెడ్డినగర్, బెస్తపూర్, ఖానాపూర్, కిష్టపూర్ వాసులు ఉలిక్కిపడ్డారు. ఏమైందోనని ఆందోళనతో కొందరు యువకులు ప్రమాద స్థలం వద్దకు చేరుకున్నారు. అప్పటికే రోడ్ల మీద మృతులు, కంకర కింద క్షతగాత్రులను చూసి చలించిపోయారు. కాగా, ఈ బస్సు ప్రమాదంలో 21 మంది మృతి చెందారు.
News November 3, 2025
ఎవరి గురించి చెడుగా మాట్లాడకండి..

పుట్టపర్తి సత్యసాయి బాబా సూక్తులు..
★ అందరిలోనూ దైవాన్ని చూడు. నువ్వు ఎవరికి నమస్కరించినా, అది చివరకు ఆ భగవంతుడికే చేరుతుంది
★ ఎప్పుడూ ఎవరి గురించి చెడుగా మాట్లాడకూడదు
★ నామస్మరణ చేయండి, మీ నాలుక మధురం అవుతుంది, మీకు మంచి కలుగుతుంది
★ కేవలం అన్నం కోసం కాక, ధర్మం కోసం బతకండి.


