News December 4, 2024

ఊపిరి పీల్చుకున్న విజయనగరం..!

image

తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో స్వల్ప భూప్రకంపనలతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఉమ్మడి జిల్లాలో అలాంటి ఆనవాళ్లు ఎక్కడా కనిపించకపోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అయితే విశాఖలో అక్కయ్యపాలెంతోపాటు పలు ప్రాంతాల్లో స్వల్పంగా భూమి కంపించిందని స్థానికులు చెబుతున్నారు. కాగా.. గత సెప్టెంబర్‌లో బొబ్బిలి, పాచిపెంట, మక్కువ, సాలూరు తదితర ప్రాంతాల్లో భూమి కంపించగా..రిక్టర్ స్కేలు 3.4గా నమోదైంది.

Similar News

News January 17, 2025

పార్వతీపురం: స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివాస్-

image

ప్రతి మూడో శనివారం స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ దివాస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తునట్లు కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్ తెలిపారు. దేశంలోనే అత్యంత పరిశుభ్ర రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో నెలలో ఒక శనివారం “స్వచ్ఛత” కోసం అంకితం కావాలని సీఎం నారా చంద్రబాబు నాయుడు పిలుపు ఆకాంక్షించారన్నారు. అందులో భాగంగా ప్రతి నెలలో మూడవ శనివారం స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ దివాస కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు.

News January 17, 2025

గడ్డం ఉమ ట్వీట్‌కు లోకేశ్ రిప్లై

image

వైఎస్ జగన్ అభిమాని గడ్డం ఉమ ట్విటర్ వేదికగా కోరిన సాయానికి మంత్రి నారా లోకేశ్ స్పందించారు. విజయనగరం చిన్నారి శ్వాసకోస సమస్యతో బాధపడుతున్నారని, ట్రీట్‌మెంట్‌కు రూ.10 లక్షలు ఖర్చవుతుందని అన్నారు. పేద కుటుంబం కావడంతో చిన్నారి వైద్యానికి సాయం అందించాలంటూ ఆమె ‘X’లో లోకేశ్‌ను కోరారు. దీనికి స్పందించిన లోకేశ్ చిన్నారికి మెరుగైన వైద్యం అందేలా చూస్తానని హామీ ఇచ్చారు.

News January 17, 2025

పార్వతీపురం: పండగ జరుపుకుని వెళ్తూ అనంత లోకాలకు

image

పార్వతీపురం మన్యం జిల్లా అల్లు వాడకు చెందిన లోలుగు <<15173201>>రాంబాబు<<>>(44) అతని కుటుంబంతో కలిసి పండగ చేసుకుని తిరిగి ఉద్యోగ నిమిత్తం తిరిగి ప్రయాణమయ్యారు. అతని భార్య ఉమాదేవి పాచిపెంటలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. బైక్‌పై వెళ్తుండగా రాంబాబు, పెద్ద కుమారుడు మోక్ష శ్రీహాన్ (5) రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. చిన్న కుమారుడు సూర్య శ్రీహాన్, భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. వీరి మృతితో విషాదఛాయలు అలుముకున్నాయి.