News January 25, 2025
ఊరించడమే కాంగ్రెసోళ్ల పని: కుత్బుల్లాపూర్ MLA

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పథకాల అమలుపై BRS కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద విమర్శలు గుప్పించారు. నేడు, రేపు, మాపు అంటూ ఊరించడమే కాంగ్రెసోళ్ల పని అని, రేషన్ కార్డులు ఇదిగో ఇస్తాం..! అదిగో ఇస్తాం..! అంటూ ఊరిస్తున్నారే తప్ప, అర్హులకు అందించడం లేదన్నారు. పేదలకు పథకాలు అందకపోతే, కుత్బుల్లాపూర్ నుంచి ఉద్యమం తప్పదని హెచ్చరించారు. ఎన్ని సార్లు దరఖాస్తులు తీసుకుంటారని ప్రశ్నించారు.
Similar News
News February 26, 2026
గోదావరి పుష్కరాలకు పకడ్బందీగా ఏర్పాట్లు: సీతక్క

2027లో జరిగే గోదావరి పుష్కరాల కోసం ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని, ఇప్పటి నుంచే అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను మంత్రి సీతక్క ఆదేశించారు. గోదావరి నదిపై నాలుగు పుష్కర ఘాట్లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. పార్కింగ్ స్థలంపై దృష్టి సారించాలన్నారు. మరుగుదొడ్ల నిర్మాణం, ప్రత్యేక గదులు ఏర్పాటు, ప్రజల భద్రతపై చర్యలు చేపట్టాలన్నారు. పాత ఘాట్ల వద్ద అవసరమైన మరమ్మతులు చేయించాలని సూచించారు.
News February 26, 2026
సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

<
News February 26, 2026
ఇందిరమ్మ ఇళ్లపై కడియం శ్రీహరి సమీక్ష

జనగామ జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగవంతం చేసి ఒక్క ఇల్లు కూడా ల్యాప్స్ కాకుండా చూడాలని, సాగునీరు అందక ఒక్క ఎకరం ఎండిపోకూడదని అధికారులకు ఎమ్మెల్యే కడియం శ్రీహరి సూచించారు. కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా, అడిషనల్ కలెక్టర్ పింకేష్ కుమార్తో సమీక్షలో ఇళ్ల పనులు వెంటనే ప్రారంభించాలని, ప్రభుత్వ భూముల వివరాలు సేకరించాలని ఆదేశించారు.


