News April 2, 2025
ఊర్కోండ: ఒంటరి మహిళ, ప్రేమ జంట కనిపిస్తే అంతే సంగతులు!

ఊర్కోండ మండలంలోని పేట ఆంజనేయ స్వామి దేవాలయం సమీపంలో వివాహితపై 8 మంది సామూహిక అత్యాచారం చేసిన ఘటన జిల్లాలో సంచలనం సృష్టించింది. కొంతకాలంగా దేవాలయం వద్దకు వచ్చే మహిళల పట్ల పోకిరీల ఆగడాలు అధికమైనట్లు తెలుస్తుంది. గతంలో అనేకమంది మహిళలకు వేధింపులు ఎదురైనట్లు ఆరోపణలు ఉన్నాయి. పోలీసులు తమదైన శైలిలో విచారణ చేస్తే మరిన్ని నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
Similar News
News November 15, 2025
ఆర్జేడీ భంగపాటుకు ప్రధాన కారణం కాంగ్రెస్ బలహీనతే!

బలహీనంగా ఉన్న కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవడమే బిహార్లో ఆర్జేడీ ఓటమికి కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. స్థానిక సమస్యలను పక్కనపెట్టి ఓట్ చోరీ ఆరోపణలపై ఎక్కువగా దృష్టిపెట్టడం కూడా మహాగఠ్బంధన్ కొంపముంచిందని చెబుతున్నారు. బలహీన కాంగ్రెస్ ఆర్జేడీకి భారమైందని, సంప్రదాయ ఓటు బ్యాంకును నమ్ముకోవడమూ ఓటమికి కారణమని అంటున్నారు. గత ఎన్నికల్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఇప్పుడు మూడో స్థానానికి పడిపోయింది.
News November 15, 2025
గ్లోబల్ ఫెరారీ రేసింగ్లో తొలి భారతీయ మహిళ

చిన్నప్పుడు అందరు పిల్లలు కార్టూన్లు చూస్తుంటే డయానా పండోలె మాత్రం రేసింగ్ చూసేది. అలా పెరిగిన ఆమె ఇండియన్ నేషనల్ కార్ రేసింగ్ ఛాంపియన్షిప్ని గెలుచుకొన్న తొలి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించింది. ప్రస్తుతం ఇద్దరు పిల్లల తల్లైనా పలు రేసుల్లో ఛాంపియన్గా నిలుస్తోంది. త్వరలో గ్లోబల్ ఫెరారీ రేసింగ్ సిరీస్లో పాల్గొని మొదటి భారతీయ మహిళగా రికార్డు సృష్టిస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు.
News November 15, 2025
WGL: వరుస రోడ్డు ప్రమాదాలు.. ముగ్గురి మృతి

ఉమ్మడి WGL జిల్లా వ్యాప్తంగా శుక్రవారం జరిగిన ప్రమాదాల్లో ముగ్గురు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. భూపాలపల్లి జిల్లాలో రాజయ్య బైక్ ప్రమాదంలో మృతి చెందాడు. రఘునాథపల్లి వద్ద గూడ్స్ వాహనం ఢీకొనగా రాపాక వినోద్ ఘటనా స్థలంలోనే చనిపోయాడు. దుగ్గొండి దగ్గర గృహప్రవేశానికి వెళ్తున్న హనుమాయమ్మ లారీ ఢీకొనడంతో మృతి చెందింది. మహబూబాబాద్, జనగామ జిల్లాల్లో జరిగిన రెండు ప్రమాదాల్లో ఐదుగురు సహా గాయపడ్డారు.


