News March 22, 2025
ఎంఎంటీఎస్ కోసం వేయికళ్లతో ఎదురుచూపు..!

వికారాబాద్ జిల్లా ప్రజలు MMTS రైలు కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ప్రతిరోజు జిల్లా నుంచి సుమారుగా 10 – 12 వేల మంది ప్రయాణికులు HYDకు వెళ్లి వస్తున్నారు. కొన్నేళ్లుగా VKB రైల్వే స్టేషన్ జంక్షన్గా కొనసాగుతుంది. కాగా MMTS సర్వీస్ ప్రస్తుతం లింగంపల్లి వరకే ఉంది. కావున MMTS సర్వీస్ను VKB వరకు పొడిగిస్తే జిల్లా ప్రజలకు ఎంతగానో మేలవుతుంది. ప్రభుత్వం ఇందుకు కృషి చేయాలని జిల్లా వాసులు కోరుతున్నారు.
Similar News
News April 25, 2025
దహెగాం: బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిపై కేసు: SI

దహెగాం మండలానికి పెసరకుంట గ్రామానికి చెందిన కామెర హొక్టుపై పోక్సో కేసు నమోదు చేసినట్టు ఎస్సై కందూరి రాజు తెలిపారు. 11 ఏళ్ల బాలిక ఇంటి వద్ద తన చెల్లిన ఆడిస్తుండగా.. హొక్టు వెళ్లి బాలికతో అసభ్యంగా ప్రవర్తించాడు. దీనిపై బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News April 25, 2025
ఖమ్మం: భానుడి ప్రతాపం.. ఈ మండలాల్లోనే అధికం

ఖమ్మం జిల్లాలో గురువారం నమోదైన ఉష్ణోగ్రతల వివరాలను వాతావరణ శాఖ వెల్లడించింది. మధిరలో 43.1, KMM(U) ఖానాపురం PS 42.9, కారేపల్లి, కామేపల్లి (లింగాల) 42.8, ముదిగొండ(పమ్మి), సత్తుపల్లి 42.7, రఘునాథపాలెం 42.6, పెనుబల్లి 42.5, నేలకొండపల్లి, తిరుమలాయపాలెం(బచ్చోడు) 42.0, కూసుమంచి 41.9, వైరా 41.8, వేంసూరు, కల్లూరు 41.6, ఎర్రుపాలెం 41.5, కొణిజర్ల, ఏన్కూరు 41.0, KMM (R) పల్లెగూడెంలో 40.3 డిగ్రీలు నమోదైంది.
News April 25, 2025
MNCL: వడదెబ్బకు ఏడుగురి మృతి

ఉమ్మడి ADB జిల్లా అగ్నిగుండంలా మారింది. రోజురోజుకు పెరుగుతున్న ఎండలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కొన్ని మండలాల్లో 45 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వారం రోజుల్లో నిర్మల్ జిల్లాలో ముగ్గురు, మంచిర్యాల జిల్లాలో ఇద్దరు, ఆసిఫాబాద్లో ఒకరు, ఆదిలాబాద్లో ఒకరు చొప్పున మృతిచెందారు. అనధికారికంగా సంఖ్యల ఎక్కువే ఉండొచ్చు. జాగ్రత్తలు పాటించండి. బయట తిరగొద్దు. నీరు అధికంగా తాగండి.