News February 13, 2025
ఎంఎల్సీ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు: కలెక్టర్

ఎంఎల్సీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని శాసన మండలి పట్టభద్రుల ఎన్నికల పరిశీలకులు కే.సునీత ఆదేశించారు. కంట్రోల్ రూం ఏర్పాటు చేయాలని సూచించారు. ఎన్నికల పీఓలను, ఏపీఓలను నియమించారా? అని అడిగి తెలుసుకున్నారు. జిల్లా కలెక్టర్ దినేశ్ కుమార్ మాట్లాడతూ.. పీఓలకు, ఏపిఓలకు, ఇతర పోలింగ్ సిబ్బంది ఈనెల 18,24 తేదీల్లో రెండు విడతల్లో శిక్షణ అందించడానికి ఏర్పాటు చేశామన్నారు.
Similar News
News December 23, 2025
రొమ్ము క్యాన్సర్కు నానో ఇంజెక్షన్

రొమ్ము క్యాన్సర్తో బాధపడుతున్న మహిళలకు IIT మద్రాసు గుడ్ న్యూస్ చెప్పింది. AUS పరిశోధకులతో కలిసి ‘కట్టింగ్ ఎడ్జ్ నానో ఇంజెక్షన్ డ్రగ్ డెలివరీ ప్లాట్ఫామ్’ను డెవలప్ చేసింది. ఈ నానో ఇంజెక్షన్తో యాంటీ క్యాన్సర్ డ్రగ్ ‘డోక్సోరుబిసిన్’ను నేరుగా క్యాన్సర్ కణాల్లోకి ఇంజెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. ప్రస్తుత కీమోథెరపీ, రేడియేషన్ పద్ధతుల వల్ల క్యాన్సర్ కణాలతో సంబంధంలేని ఇతర భాగాలపై ప్రభావం పడుతోంది.
News December 23, 2025
వింటర్లో గర్భిణులకు ఈ జాగ్రత్తలు

శీతాకాలంలో ఇమ్యునిటీ తక్కువగా ఉండటం వల్ల గర్భిణులు అనేక సమస్యలు ఎదుర్కొంటారు. ఇలా కాకుండా ఉండాలంటే విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే పండ్లు, కూరగాయలు తీసుకోవాలి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. చాలా చల్లగా ఉండే ఆహార పదార్థాలను తినడం మానుకోండి. తేలికపాటి వ్యాయామాలు చెయ్యాలి. ఎప్పటికప్పుడు ప్రినేటల్ చెకప్లు చేయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
News December 23, 2025
బాపట్లకు భారీ పరిశ్రమ

సౌర విద్యుత్ ఉత్పత్తి భారీ పరిశ్రమ ఏర్పాటుకు బల్లికురవ, సంతమాగులూరు మండలాలలో 1,591.17 ఎకరాల భూమికి సహకరించాలని కలెక్టర్ వినోద్ కుమార్ సోమవారం అన్నారు. ఈ పరిశ్రమకు కేటాయించే భూసేకరణకు నిధులు విడుదలయ్యాయన్నారు. వేగంగా భూసేకరణ చేపట్టి, ల్యాండ్ బ్యాంకు సిద్ధం చేయాలన్నారు. 2 వారాలలో సమగ్ర నివేదిక ఇవ్వాలని పేర్కొన్నారు. ప్రభుత్వ, అసైన్డ్ భూమి ఉండేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు.


