News October 31, 2024

ఎంఎస్‌ రాజును మరోసారి వరించిన అదృష్టం

image

మడకశిర MLA ఎంఎస్‌ రాజుకు టీటీడీ బోర్డ్ సభ్యుడిగా అవకాశం దక్కడంతో ఆ పార్టీ కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పార్టీకి చేసిన సేవలకు గానూ మరో గుర్తింపు దక్కిందని కొనియాడుతున్నారు. గత ప్రభుత్వంలో ఆయనపై 60 కేసులు నమోదయ్యాయి. ఎన్నికల్లో చివరి నిమిషంలో టికెట్ దక్కించుకొని విజయం సాధించారు. లోకేశ్ పాదయాత్రలో ఆయన వెంటే ఉన్నారు. చంద్రబాబు అరెస్టు సమయంలో అనంతపురం నుంచి అమరావతి వరకు సైకిల్‌ యాత్ర చేశారు.

Similar News

News July 11, 2025

కరవు నివారణకు శాశ్వత పరిష్కారం కనుగొందాం: కేంద్ర మంత్రి

image

రాయలసీమ జిల్లాల్లో కరవు నివారణకు శాశ్వత పరిష్కారం కనుగొందామని కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టరేట్‌లో దక్షిణ ఏపీలోని కరవు పీడిత జిల్లాల సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, వ్యవసాయ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

News July 10, 2025

‘విద్యార్థులారా.. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి’

image

అనంతపురం JNTUలో స్వీడన్ బ్యాచ్ కోర్స్‌ను ప్రారంభించినట్లు వీసీ సుదర్శన రావు, రిజిస్ట్రార్ కృష్ణయ్య, డైరెక్టర్ సుజాత తెలిపారు. 4 ఏళ్ల బీటెక్ CSE/ECE కోర్సులో మొదట మూడేళ్లు JNTUలో, 4వ ఏడాది స్వీడన్‌లో చదవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఆసక్తి గల వారు ఈనెల 17వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. వివరాలకు JNTUలోని డైరెక్టర్ ఆఫ్ ఫారిన్ అఫైర్స్ కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు.

News July 8, 2025

మెగా పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టాలి: కలెక్టర్

image

పాఠశాలలో ఈనెల 10న జరగనున్న మెగా పేరంట్, టీచర్స్ మీటింగ్ 2.0 కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని అధికారులను అనంతపురం కలెక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయం నుంచి మండల విద్యాశాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. మీటింగ్‌లో తల్లితండ్రులను భాగస్వాములను చేయాలన్నారు. పాఠశాలల అభివృద్ధి గురించి వివరించాలన్నారు.