News January 22, 2025

ఎంజీయూ డిగ్రీ 1, 3, 5వ సెమిస్టర్ ఫలితాలు విడుదల

image

ఎంజీ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ 1, 3, 5 సెమిస్టర్‌ల ఫలితాలను ఉపకులపతి ఆచార్య కాజా అల్తాఫ్ హుస్సేన్ విడుదల చేశారు. డిగ్రీ మొదటి సెమిస్టర్‌లో 6300 మంది విద్యార్థులకు గాను 1338 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా, 3వ సెమిస్టర్‌లో 4509 మందికి గాను 1569 మంది, 5వ సెమిస్టర్‌లో 5378 మందికి గాను 2380 మంది ఉత్తీర్ణత సాధించినట్లు సీఓజీ డా. ఉపేందర్ రెడ్డి తెలిపారు.

Similar News

News February 7, 2025

నల్గొండ: గ్రీవెన్స్ డే.. ఇక నుంచి ‘డయల్ యువర్ సైబర్ నేస్తం’

image

ప్రతి సోమవారం నిర్వహించే గ్రీవెన్స్ డేలో ఇప్పటినుంచి సైబర్ క్రైమ్‌కి సంబంధించిన ఫిర్యాదులు కూడా తీసుకోనున్నట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఓ ప్రకటన ద్వారా తెలిపారు. ఈ మేరకు ‘డయల్ యువర్ సైబర్ నేస్తం’ అనే కార్యక్రమాన్ని ఈ సోమవారం నుంచే ప్రారంభించబోతున్నట్లు చెప్పారు. ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు బాధితులు తమ సమస్యలను తెలియజేయవచ్చన్నారు.

News February 7, 2025

NLG: ఈనెల 10 నుంచి ఆపదమిత్ర వాలంటీర్లకు శిక్షణ

image

ఈ నెల 10 నుంచి 21 వరకు 300 మంది ఆపదమిత్ర వాలంటీర్లకు మూడు విడతల్లో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థలో శిక్షణ ఇవ్వనున్నట్లు డీఆర్డీవో శేఖర్ రెడ్డి తెలిపారు. ఈ శిక్షణలో వాలంటీర్లకు జిల్లాలో భూకంపాలు, కొండచరియలు విరిగినప్పుడు, వరదలు, తుపాను, పిడుగులు పడటం వంటివి జరిగినప్పుడు తీసుకోవాల్సన జాగ్రత్తల గురించి వివరిస్తామన్నారు. ప్రాణనష్టం నివారణ చర్యలపై శిక్షణ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. 

News February 7, 2025

నల్గొండలో నామినేషన్ వేయనున్న అభ్యర్థులు

image

నామినేషన్లకు 7, 10వ తేదీల్లోనే అవకాశం ఉండటంతో ఈ2 రోజుల్లో నామినేషన్లు దాఖలు చేసేందుకు ప్రధాన సంఘాల అభ్యర్థులు సిద్ధమవుతున్నారు. శుక్రవారం TSUTF తరఫు ప్రస్తుత ఎమ్మెల్సీ ఆలుగుబెల్లి నర్సిరెడ్డి, అలాగే TPUS అభ్యర్థి సరోత్తంరెడ్డితో పాటు స్వతంత్ర అభ్యర్థి హర్షవర్ధన్ రెడ్డి కూడా నామినేషన్లు సమర్పించనున్నారు. కాగా PRTU అభ్యర్థి శ్రీపాల్రెడ్డి 10న నామినేషన్ వేయనున్నట్లు సమాచారం.

error: Content is protected !!