News February 22, 2025

ఎండతో భగ్గుమంటున్న వరంగల్!

image

వరంగల్ జిల్లాలో ఎండలు భగ్గుమంటున్నాయి. పలు చోట్ల ఉదయం మంచు కురుస్తుండగా.. మరికొన్ని చోట్ల ఎండ తీవ్ర ప్రభావం చూపిస్తోంది. అంతేకాదు, చెరువులు, వాగులు, కుంటల్లో సైతం నీరు ఖాళీ అవుతోంది. దీంతో ప్రయాణం సాగించాలంటేనే వృద్ధులు, పిల్లలు జంకుతున్నారు. మరి మీ ప్రాంతంలో ఎండ ప్రభావం ఎలా ఉందో కామెంట్ చేయండి.

Similar News

News March 18, 2025

మహబూబాబాద్‌: నిలిచిన పలు రైళ్లు..!

image

సాంకేతిక సమస్య తలెత్తి మహబూబాబాద్ జిల్లా గుండ్రాతిమడుగు రైల్వే స్టేషన్ శివారులో ఓ గూడ్స్ రైలు నిలిచిపోయింది. దీంతో కాజీపేట వైపు వెళ్లే పలు రైళ్లు ఆలస్యంగా వెళ్లాయి. గుండ్రతిమడుగు వద్ద తమిళనాడు ఎక్స్‌ప్రెస్, గార్ల రైల్వే స్టేషన్‌లో ఏపీ ఎక్స్‌ప్రెస్, డోర్నకల్ రైల్వే స్టేషన్‌లో కాకతీయ ప్యాసింజర్ నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.

News March 18, 2025

వరంగల్: రైలు తగిలి తెగిపడ్డ చేయి

image

రైలు తగిలి చేయి తెగిపడ్డ ఘటన వరంగల్ రైల్వేస్టేషన్లో చోటు చేసుకుంది. వరంగల్ రామన్నపేటకు చెందిన నరసింహ (50) వరంగల్ రైల్వే స్టేషన్లో ఒకటో నంబర్ ప్లాట్ ఫాంపై నిలుచున్నాడు. అప్పుడే వచ్చిన జైపూర్ ఎక్స్‌ప్రెస్ అతడికి తగలడంతో చేయి తెగి పడింది. వెంటనే రైల్వే సిబ్బంది 108కు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అంబులెన్స్ సిబ్బంది, ప్రథమ చికిత్స అందించి వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.

News March 18, 2025

వరంగల్: ‘పది’ పరీక్ష పదిలంగా!

image

ఈ నెల 21 నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. కాగా పరీక్షలు దగ్గర పడటంతో కొంతమంది విద్యార్థులు గాబరా పడి సమాధానం తెలిసినా సరిగా రాయలేకపోతుంటారు. వారంతా ఒత్తిడికి లోనుకాకుండా నేను బాగా చదివాను.. బాగా రాస్తాను అని కాన్ఫిడెంట్‌గా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. వీరంతా సెల్‌ఫోన్, టీవీకి దూరంగా ఉన్నట్లయితే మంచి మార్కులు వచ్చే అవకాశం ఉంది. జిల్లాలో 9,237 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు.

error: Content is protected !!