News April 14, 2025
ఎండపల్లి: అంబేడ్కర్ వేషధారణలో బాలుడు

ఎండపల్లి మండల కేంద్రంలో వివేకానంద యూత్ ఆధ్వర్యంలో సోమవారం డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా బాలుడు తునికి శ్రీ కీర్తన్ అంబేడ్కర్ వేషధారణలో అందరినీ ఆకట్టుకున్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న బాలుడకి అంబేడ్కర్ గొప్పదనం గురించి తమ గురువులు చెప్పారని అన్నారు. అంబేడ్కర్ అంటే తనకు ఇష్టమని తెలిపారు.
Similar News
News December 8, 2025
ప్రపంచాన్ని ఏకం చేసేలా HYDలో సమ్మిట్

HYD శివారు మీర్ఖాన్పేట్ గ్లోబల్ సమ్మిట్కు వేదికైంది. 44కిపైగా దేశాలు, 154 మంది అంతర్జాతీయ ప్రతినిధులు, గ్లోబల్ కంపెనీలు పాల్గొననున్న ఈ సమ్మిట్ మ.1:30కు ప్రారంభం కానుంది. నోబెల్ గ్రహీతలు అభిజిత్, కైలాష్ సత్యర్థి ప్రధాన వక్తలు. వీరిలో 46 మంది అమెరికా ప్రతినిధులు, ప్రపంచ బ్యాంక్, అమెజాన్, ఐకియా తదితర ప్రతినిధులు ఉన్నారు. అంతేకాదు ఏరోస్పేస్, డిఫెన్స్ రంగ కంపెనీలు, ఇతర దేశాల రాయబారులు రానున్నారు.
News December 8, 2025
భీమవరంలో బాలికలపై టీచర్ లైంగిక వేధింపులు..!

విద్యార్థినులను ఉపాధ్యాయుడు లైంగిక వేధింపులకు గురిచేస్తున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భీమవరం మండలం గొల్లవానితిప్ప ఉన్నత పాఠశాల బాలికలను మ్యాథ్స్ టీచర్ లైంగికంగా వేధించినట్లు తెలియడంతో తల్లిదండ్రుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై తాజాగా నిర్వహించిన PTMలో తల్లిదండ్రులు అధికారులకు వివరించారు. చట్టపరంగా ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు పేర్కొన్నారు.
News December 8, 2025
VKB: నిద్రిలో నిఘా వ్యవస్థ.. సరిహద్దులు దాటుతున్న ధాన్యం

అధికారుల నిర్లక్ష్యం, ప్రజాప్రతినిధుల అండతో పంటను దళారులు కొనుగోలు చేసి సరిహద్దులు దాటిస్తున్నారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు, వ్యాపారులు కుమ్మక్కై ధాన్యాన్ని గుట్టుచప్పుడు కాకుండా ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. నిఘా వ్యవస్థ నిద్రపోవడంతో ధాన్యం పక్క రాష్ట్రాలకు తరలిపోతుందని మండిపడుతున్నారు. రైతుల దగ్గర తక్కువకు కొనుగోలు చేసి ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారని చెబుతున్నారు.


