News April 24, 2025

ఎండల వేళ.. జాగ్రత్త!

image

కొన్నిరోజులగా నంద్యాల జిల్లా నిప్పుల కుంపటిని తలపిస్తోంది. ఉదయం 8 గంటల నుంచే ఎండలు ఠారెత్తిస్తున్నాయి. 40 నుంచి 44 °C ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. నీటిని బాగా తాగడంతోపాటు చలువ కోసం కొబ్బరి నీళ్లు, పండ్ల రసాలు తీసుకోవాలని చెబుతున్నారు. మధ్యాహ్నం వేళ వృద్ధులు, పిల్లలు ఇళ్లకే పరిమితం కావాలని సూచిస్తున్నారు.

Similar News

News April 24, 2025

PSL ప్రసారంపై నిషేధం

image

మన దేశంలో పాకిస్థాన్ సూపర్ లీగ్(PSL) ప్రసారంపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. పహల్‌గామ్‌లో ఉగ్రదాడిని తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. భారత్‌లో PSL‌ను స్పోర్ట్స్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఫ్యాన్‌కోడ్‌ లైవ్ ఇస్తోంది. కేంద్రం తాజా నిర్ణయంతో ఇవాళ్టి నుంచి PSL ప్రసారం ఆగిపోనుంది. భారత్ పాక్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడబోదని ఇప్పటికే BCCI ప్రకటించిన విషయం తెలిసిందే.

News April 24, 2025

మాచవరం: ఈతకు వెళ్లి ఇద్దరి విద్యార్థుల మృతి 

image

మాచవరం మండలం కొత్తపాలెంలో ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు మృతిచెందారు. ఏఎస్ఐ విజయ శేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తపాలెం ఎస్సీ కాలనీకి చెందిన యేసు రాజు(16), జస్వంత్(9) మరణించారు. పాఠశాలలకు వేసవి సెలవులు కావడంతో ఈత కొట్టేందుకు బావిలోకి దిగారు. సరిగ్గా ఈత రాకపోవడంతో ఆ ఇద్దరు చనిపోయారు. వీరి మృతితో కొత్తపాలెంలో విషాదఛాయలు అలముకున్నాయి. 

News April 24, 2025

అల్లూరి జిల్లాలో గంజాయి తగ్గుముఖం: కలెక్టర్

image

గంజాయి నిర్మూలన బాధ్యత అందరిపైనా ఉందని  కలెక్టర్ ఎ.ఎస్.దినేష్ కుమార్ స్పష్టం చేశారు. అల్లూరి జిల్లాలో గంజాయి తగ్గుముఖం పట్టిందన్నారు. కలెక్టరేట్‌లో గంజాయి సాగు నిర్మూలన, ప్రత్యామ్నాయ పంటలపై అధికారులతో గురువారం సమావేశం నిర్వహించారు. గంజాయి నిర్మూలన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. డిగ్రీ కళాశాలలు, జూనియర్ కళాశాలలు, ఉన్నత పాఠశాలల్లో గంజాయి వినియోగంపై కలిగే నష్టాలపై అవగాహన కల్పించాలని పేర్కొన్నారు.

error: Content is protected !!