News April 5, 2024

‘ఎంపీ బీబీ పాటిల్ చేసిన అభివృద్ధి శూన్యం’

image

ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుల ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేసినట్లు నాగిరెడ్డి పేట పార్టీ మండల అధ్యక్షుడు భూమ శ్రీధర్ గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ పది సంవత్సరాల ఎంపీ పదవీకాలంలో బీబీ పాటిల్ ఎల్లారెడ్డి నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి శూన్యమన్నారు. ప్రభుత్వ ఆసుపత్రికి అంబులెన్సు, పరికరాలను ఇస్తామని చెప్పి ఇప్పటి వరకూ అందించలేదన్నారు.

Similar News

News January 15, 2025

NZB: కేటీఆర్ జైలుకు వెళ్తారు: ఎంపీ అర్వింద్

image

తెలంగాణాలో BRS భూస్థాపితం కాబోతోందని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి అన్నారు. ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ కవిత ఇప్పటికే జైలుకు వెళ్లి వచ్చారని, ఇప్పుడు కేటీఆర్ సైతం జైలుకు వెళ్తారని జోస్యం చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే ఏదో సాధించామని మాజీ ముఖ్యమంత్రి, BRS అధినేత KCR ఎర్రవల్లి ఫామ్ హౌస్‌లో పడుకున్నారని ఎద్దేవా చేశారు.

News January 15, 2025

NZB: కేటీఆర్ జైలుకు వెళ్తారు: ఎంపీ అర్వింద్

image

తెలంగాణాలో BRS భూస్థాపితం కాబోతోందని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి అన్నారు. ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ కవిత ఇప్పటికే జైలుకు వెళ్లి వచ్చారని, ఇప్పుడు కేటీఆర్ సైతం జైలుకు వెళ్తారని జోస్యం చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే ఏదో సాధించామని మాజీ ముఖ్యమంత్రి, BRS అధినేత KCR ఎర్రవల్లి ఫామ్ హౌస్‌లో పడుకున్నారని ఎద్దేవా చేశారు.

News January 15, 2025

NZB: పసుపు బోర్డుతో అందరికీ లాభం: MP అర్వింద్

image

పసుపు బోర్డుతో కేవలం పసుపు రైతులకే ఉపయోగం ఉంటుందని కొంతమంది భావిస్తున్నారని, కానీ దాని వల్ల అందరికీ లాభం ఉంటుందని నిజామాబాద్ ఎంపీ అరవింద్ ధర్మపురి చెప్పారు. నిజామాబాద్‌లో అల్లం, పసుపు, కూరగాయలు అనేక పంటలు పండుతాయని ఆ రైతులకూ లబ్ధి చేకూరే అవకాశం ఉందని చెప్పారు. అలాగే నిజామాబాద్ ప్రాంతంలో బీడీ కార్మికులు ఎక్కువగా ఉన్నారని, బోర్డుతో వారికీ ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉందని చెప్పారు.