News July 20, 2024

ఎంపీ విజయసాయి రెడ్డితో చంద్రశేఖర్ రెడ్డి భేటీ

image

ఢిల్లీలో చేపట్టబోయే దీక్షకు సంబంధించి చేపట్టాల్సిన కార్యక్రమాలపై ఎంపీ విజయసాయి రెడ్డితో నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి చర్చించారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపుమేరకు వినుకొండలో వైసీపీ కార్యకర్త రషీద్ హత్యను నిరసిస్తూ ఈ నెల 24 వ తేదీ ఢిల్లీలో ధర్నా చేపడుతున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి చేపట్టాల్సిన అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి ఎంపీ గురుమూర్తి ఉన్నారు.

Similar News

News January 6, 2026

నెల్లూరు: తెల్లవారుజామున రైలు కింద పడి సూసైడ్

image

మనుబోలు- గూడూరు రైల్వే స్టేషన్ మధ్య చెర్లోపల్లి రైల్వే గేట్ సమీపంలో మూడో రైల్వే లైన్‌పై మంగళవారం తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తి గూడ్స్ రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి వయస్సు 45-50 ఉంటుందని రైల్వే ఎస్ఐ హరిచందన తెలిపారు. మృతుడు పచ్చ రంగు ఫుల్ హాండ్స్ షర్టు బులుగు రంగు గళ్ల లుంగి ధరించి ఉన్నాడు. కుడి చేతికి ఎర్రని దారం కట్టుకొని ఉన్నాడు. ఎస్ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News January 6, 2026

కొత్తగా ఉద్యోగంలో చేరిన కార్మికులకు EPFO తప్పనిసరి : కలెక్టర్

image

నూతనంగా ఉద్యోగంలో చేరిన కార్మికులను తప్పనిసరిగా EPFO పరిధిలో వచ్చే విధంగా నమోదు చేయడంపై ప్రత్యేక దృష్టి సారించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆదేశించారు. సోమవారం వారి ఛాంబర్‌లో ప్రధాన మంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన (PM-VBRY) అమలుపై జిల్లా స్థాయి సమన్వయ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో పని చేస్తున్న కార్మికులను తప్పనిసరిగా EPFO పరిధిలో నమోదు చేయాలన్నారు.

News January 6, 2026

కొత్తగా ఉద్యోగంలో చేరిన కార్మికులకు EPFO తప్పనిసరి : కలెక్టర్

image

నూతనంగా ఉద్యోగంలో చేరిన కార్మికులను తప్పనిసరిగా EPFO పరిధిలో వచ్చే విధంగా నమోదు చేయడంపై ప్రత్యేక దృష్టి సారించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆదేశించారు. సోమవారం వారి ఛాంబర్‌లో ప్రధాన మంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన (PM-VBRY) అమలుపై జిల్లా స్థాయి సమన్వయ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో పని చేస్తున్న కార్మికులను తప్పనిసరిగా EPFO పరిధిలో నమోదు చేయాలన్నారు.