News July 20, 2024

ఎంపీ విజయసాయి రెడ్డితో చంద్రశేఖర్ రెడ్డి భేటీ

image

ఢిల్లీలో చేపట్టబోయే దీక్షకు సంబంధించి చేపట్టాల్సిన కార్యక్రమాలపై ఎంపీ విజయసాయి రెడ్డితో నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి చర్చించారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపుమేరకు వినుకొండలో వైసీపీ కార్యకర్త రషీద్ హత్యను నిరసిస్తూ ఈ నెల 24 వ తేదీ ఢిల్లీలో ధర్నా చేపడుతున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి చేపట్టాల్సిన అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి ఎంపీ గురుమూర్తి ఉన్నారు.

Similar News

News February 27, 2026

ప్రతి పోలీసుకు అండగా ఉంటాం: SP

image

నెల్లూరు ఎస్పీ డా.అజిత వేజెండ్ల ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది సమస్యల పరిష్కారం కోసం ‘డయల్ యువర్ ఎస్పీ’ (SP-సంపర్క్) కార్యక్రమం నిర్వహించారు. శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమంలో 13 మంది సిబ్బంది తమ బదిలీలు, మెడికల్ బిల్లులు, ప్రమోషన్ల వంటి అంశాలను నేరుగా ఎస్పీకి ఫోన్ ద్వారా వివరించారు. ఈ సమస్యలపై సానుకూలంగా స్పందించిన ఎస్పీ క్షేత్రస్థాయిలో పనిచేసే ప్రతి పోలీస్ వెనుక శాఖ ఉంటుందని భరోసా ఇచ్చారు.

News February 27, 2026

నెల్లూరు: ఈ నంబర్లతో అమ్మాయిలకు రక్ష.!

image

మహిళల భద్రత కోసం రూపొందించిన ‘శక్తి’ యాప్‌పై నెల్లూరు ఎస్పీ డా.అజిత వేజెండ్ల ఆదేశాల మేరకు పోలీసులు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా బస్టాండ్లు, కళాశాలల్లో మహిళలు, విద్యార్థినులకు ఈ యాప్ డౌన్లోడ్ విధానం, ఆపద సమయంలో పోలీసుల తక్షణ సాయం పొందే తీరును వివరిస్తున్నారు. దీనితో పాటు డయల్ 100, 112, 1930 వంటి హెల్ప్‌లైన్ నంబర్లపై కూడా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.

News February 27, 2026

ఫొక్సో కేసులపై నెల్లూరు SP కీలక ఆదేశాలు

image

ఫొక్సో కేసులలో అభియోగ పత్రాల దాఖలు వేగవంతం చేయాలని ఎస్పీ డా.అజిత వేజెండ్ల అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆమె జిల్లా పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సైబర్ ఫ్రాడ్ కేసులలో హోల్డ్ మనీ రికవరీ వేగవంతం కావాలన్నారు. అందుకు సంబందించి అధికారులకు అవగహన కల్పించారు.