News March 16, 2025

ఎఐ ద్వారా విద్యా బోధన: ASF అదనపు కలెక్టర్

image

రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసిన ప్రాథమిక పాఠశాలల్లో ఎఫ్ఎల్ఎన్ కార్యక్రమంలో భాగంగా 3, 4, 5 తరగతుల విద్యార్థుల కోసం ఏఐ ద్వారా విద్య బోధన చేయనున్నట్లు ఆసిఫాబాద్  అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. శనివారం కెరమెరి మండలం గోయగం ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటుచేసిన ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ల్యాబ్‌ను ఆయన ప్రారంభించారు. పాఠశాలలో వెనుకబడిన విద్యార్థులకు కంప్యూటర్ ద్వారా బోధన అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు.

Similar News

News November 26, 2025

జగిత్యాల: ‘రాజ్యాంగం ద్వారానే బలహీనవర్గాలకు సంక్షేమ ఫలాలు’

image

అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం ద్వారానే బడుగు, బలహీన వర్గాలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు విద్యాసాగర్ రావు అన్నారు. బీఆర్ఎస్ కార్యాలయంలో బుధవారం రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ‘అంబేద్కర్ సూర్యుడు’ అనే పుస్తకాన్ని అంబేడ్కర్ సేవా సభ్యులు నరేందర్, శివ, కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్, మాజీ జడ్పీ చైర్ పర్సన్ దావ వసంతలకు అందజేశారు.

News November 26, 2025

‘పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి’

image

పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ఐ. రాణి కుముదిని అన్నారు.
పంచాయతీ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ఐ. రాణి కుముదిని జిల్లా కలెక్టర్లు, జిల్లా అధికారులతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. రాజన్న సిరిసిల్ల నుంచి ఇన్చార్జి కలెక్టర్ గరీమ అగర్వాల్ అధికారులు పాల్గొన్నారు

News November 26, 2025

NRPT: ఎన్నికల నిర్వహణపై అధికారులకు అవగాహన

image

సర్పంచ్ ఎన్నికల నిర్వహణ, ప్రచారంపై కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఎస్పీ డాక్టర్ వినీత్ తో కలిసి బుధవారం నైపుణ్య అభివృద్ధి కేంద్రంలో తహశీల్దార్‌లు, ఎస్‌ఎస్‌టీ, ఎస్‌ఎఫ్‌టీ బృందం అధికారులతో సమావేశం నిర్వహించారు. విధులను పకడ్బందీగా నిర్వహించాలని, ఓటర్లను ప్రభావితం చేసే మద్యం, డబ్బు పంపిణీపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.