News March 16, 2025

ఎఐ ద్వారా విద్యా బోధన: ASF అదనపు కలెక్టర్

image

రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసిన ప్రాథమిక పాఠశాలల్లో ఎఫ్ఎల్ఎన్ కార్యక్రమంలో భాగంగా 3, 4, 5 తరగతుల విద్యార్థుల కోసం ఏఐ ద్వారా విద్య బోధన చేయనున్నట్లు ఆసిఫాబాద్  అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. శనివారం కెరమెరి మండలం గోయగం ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటుచేసిన ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ల్యాబ్‌ను ఆయన ప్రారంభించారు. పాఠశాలలో వెనుకబడిన విద్యార్థులకు కంప్యూటర్ ద్వారా బోధన అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు.

Similar News

News February 8, 2026

NLG: 22 మంది ఎంఈఓలకు కలెక్టర్ షోకాజ్ నోటీసులు

image

ప్రీ-మెట్రిక్ స్కాలర్‌షిప్‌ల నమోదు ప్రక్రియలో నిర్లక్ష్యం వహించిన 22 మంది మండల విద్యాధికారులపై (MEOs) నల్గొండ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జనవరి 30 నాటికి పూర్తి కావాల్సిన లక్ష్యాన్ని చేరుకోవడంలో విఫలమైనందుకు వారికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. విద్యార్థుల ఉపకార వేతనాల విషయంలో అలసత్వం వహించడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ, దీనిపై వివరణ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

News February 8, 2026

‘ముస్తాబు’తో ప్రభుత్వ పాఠశాల రూపురేఖలు మారాలి: పార్వతీపురం కలెక్టర్

image

పార్వతీపురం జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు సమూల మార్పులతోనే ‘స్కూల్ ముస్తాబు’ కార్యక్రమం లక్ష్యం నెరవేరుతుందని కలెక్టర్ ప్రభాకర రెడ్డి అన్నారు. బెలగాంలో గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాలను ఆదివారం కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. విద్యార్థుల ఆరోగ్యం, వ్యక్తిగత పరిశుభ్రత పట్ల బాధ్యత తీసుకోవాలని, గేటు నుంచి తరగతి గదుల వరకు మార్గాన్ని అందమైన పూలు, పచ్చని మొక్కలతో ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాలని సూచించారు.

News February 8, 2026

KNR: మున్సిపల్ ఎన్నికలు.. ఫేక్ సర్వేలు!

image

మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగింపు దశకు చేరుకోవడంతో అభ్యర్థులు ఫేక్ సర్వేలకు తెరలేపుతున్నారు. కరీంనగర్ జిల్లాలో తమ పార్టీ గెలుస్తుందంటూ నకిలీ సర్వే ఫలితాలను ప్రచారం చేస్తూ ఓటర్లను ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తున్నారు. వాట్సాప్ గ్రూపుల ద్వారా ఈ సర్వేలను, విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. వాస్తవానికి వీటికి ఎలాంటి అధికారిక ఆధారాలు లేకపోవడంతో ఓటర్లు అప్రమత్తంగా ఉండాలని పలువురు సూచిస్తున్నారు.