News January 28, 2025
ఎకో టూరిజం స్పాట్గా వికారాబాద్: CM

వికారాబాద్ను ఎకో టూరిజం స్పాట్గా చేస్తామని CM రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి టెంపుల్ టూరిజం, హెల్త్ టూరిజం, ఎకో టూరిజం అవసరమని అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రొద్దుటూరులో ఎక్స్పీరియం పార్కు ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వాల హయాంలో టూరిజం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందన్నారు. మల్లెలతీర్థం, కొల్లాపూర్లో అద్భుతమైన ప్రకృతి ఉందని, వాటినీ అభివృద్ధి చేస్తామన్నారు.
Similar News
News November 5, 2025
ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్: ఎస్పీ

ప్రొద్దుటూరులో ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న 6 మంది సభ్యుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆన్లైన్ యాప్ల ద్వారా బెట్టింగ్ నిర్వహిస్తూ, పదుల సంఖ్యలో ఫేక్ కరెంట్ బ్యాంక్ అకౌంట్లు తెరిచి ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నట్టు ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ తెలిపారు. ఈ ముఠా నుంచి రూ.6.28 లక్షల నగదు, ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
News November 5, 2025
VZM: దివ్యాంగులకు సబ్సిడీతో రిట్రోఫిటేడ్ మోటరైజ్డ్ వాహనాలు

దివ్యాంగులకు 100% సబ్సిడీతో ప్రభుత్వం రిట్రోఫిటేడ్ మోటరైజ్డ్ వాహనాలను మంజూరు చేయనుందని జిల్లా విభిన్న ప్రతిభావంతుల శాఖ సహాయ సంచాలకుడు ఆశయ్య బుధవారం తెలిపారు. అర్హులైన దివ్యాంగులు ఈనెల 25వ తేదీ లోగా www.apdascac.ap.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వయస్సు 18-45 సంవత్సరాల మధ్య ఉండాలి. కనీసం 70% లోయర్ లింబ్ దివ్యాంగత కలిగి ఉండాలని, వార్షిక ఆదాయం రూ.3 లక్షల లోపు ఉండాలన్నారు.
News November 5, 2025
ఓటేసేందుకు వెళ్తున్న బిహారీలు.. ఆగిన నిర్మాణ పనులు

దేశంలోని చాలా ప్రాంతాల్లో నిర్మాణం, హోటల్స్ సహా అనేక రంగాల్లో లక్షలాది మంది బిహార్ వలస కార్మికులు పనిచేస్తున్నారు. ఈనెల 6, 11 తేదీల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేయడానికి వారంతా స్వస్థలాలకు వెళ్తున్నారు. దీంతో ఆయా రంగాలపై ప్రభావం పడుతోంది. దాదాపు 8 లక్షల మంది బిహార్ కార్మికులు హైదరాబాద్లో ఉంటున్నట్లు అంచనా. వీరంతా వచ్చే వరకు 10 రోజులు పనులకు ఇబ్బంది తప్పదని నిర్మాణ పరిశ్రమ తెలిపింది.


