News November 27, 2024
ఎక్కడా ఆగకుండా.. నేరుగా తిరుమల శ్రీవారి దర్శనం

తిరుమల శ్రీవారి దర్శనానికి ప్రస్తుతం నేరుగా లైన్ వెళ్తుంది. అన్ని కంపార్టుమెంట్లు ఖాళీగా ఉన్నాయి. ఉదయం 7:30 నుంచి 8 గంటల తరువాత నిండే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. స్వామివారిని మంగళవారం 64,525 మంది దర్శించుకున్నారు. 19,880 మంది తలనీలాలు సమర్పించారు. సోమవారం హుండీ ద్వారా సమర్పించిన కానుకలను మంగళవారం లెక్కించగా రూ.3.53 కోట్ల ఆదాయం వచ్చిందని టీటీడీ అధికారులు బుధవారం ప్రకటించారు.
Similar News
News November 8, 2025
వంద శాతం దీపం కనెక్షన్లు ఇచ్చాం: బాబు

1,291 కుటుంబాలకు LPG కనెక్షన్లు ఇచ్చామని CM చంద్రబాబు తెలిపారు. 37,324 మందికి పెన్షన్లు ఇస్తున్నామని, 42,232 మంది విద్యార్థుల తల్లులకు తల్లికి వందనం అందించామన్నారు. P4 కింద 7,401 బంగారు కుటుంబాలను దత్తత తీసుకునేలా చేశామని చెప్పారు. 7,489 SC, ST కుటుంబాలకు సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు ఈ నెలాఖరుకు పూర్తవుతుందన్నారు. 5 లక్షల లీటర్ల పాలు కుప్పంలో ప్రస్తుతం ఉత్పత్తి అవుతోందని ఇది 10 లక్షలకు చేరాలని కోరారు.
News November 8, 2025
చిత్తూరు: జర్నలిజం పేరుతో వేధింపులు తగదు

జర్నలిజం పేరుతో అధికారులను వేధించడం తగదని కలెక్టర్ సుమిత్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. బ్లాక్ మెయిల్ చేసే విలేకరులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వ కార్యాలయాలలో సిబ్బంది నిర్భయంగా పనిచేసుకునే వాతావరణం కల్పించడం తన బాధ్యతని పేర్కొన్నారు. ఇద్దరు పాత్రికేయులు మహిళా ఉద్యోగులను బెదిరించిన సంఘటన తన దృష్టికి వచ్చిందన్నారు. దీనిని విచారించి ఒకరి అక్రిడేషన్ రద్దు చేశామన్నారు.
News November 8, 2025
కుప్పంలో పరిశ్రమలు ఏర్పాటుకు సీఎం శంకుస్థాపన

కుప్పం నియోజకవర్గంలో ఏడు పరిశ్రమలు ఏర్పాటుకు సంబంధించి శనివారం సీఎం చంద్రబాబు వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేశారు. సుమారు రూ.2200 కోట్ల పెట్టుబడితో 22 వేల మందికి ప్రత్యక్ష, పరోక్ష పద్ధతిలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ఏడు పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయని అన్నారు. దీనికి సంబంధించి శనివారం అమరావతి నుంచి సీఎం చంద్రబాబు నాయుడు వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేశారు.


