News March 28, 2024
ఎక్కడున్నా ఓ కన్ను కొడంగల్పైనే: CM రేవంత్ రెడ్డి

తాను ఎక్కడున్నా ఓ కన్ను కొడంగల్పైనే ఉంటుందని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నికల నేపథ్యంలో గురువారం ఓటు వేసి అనంతరం కొడంగల్లోని తన నివాసం వద్ద అభిమానులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. పార్లమెంట్ ఎన్నికల్లో కొడంగల్ నుంచి కాంగ్రెస్కు 50 వేల మెజార్టీ ఇవ్వాలని కోరారు. నియోజకవర్గానికి పరిశ్రమలు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు.
Similar News
News November 16, 2025
ప్రైవేటు బస్సు ఆపరేటర్లకు RTA స్ట్రాంగ్ వార్నింగ్

చేవెళ్ల బస్సు ప్రమాదం తరువాత RTA అధికారులు అప్రమత్తమయ్యారు. ఎక్కడికక్కడ ప్రైవేటు వాహనాలను తనిఖీ చేస్తూ చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ జిల్లా జాయింట్ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ రమేశ్ ప్రైవేటు బస్సు ఆపరేటర్లకు వార్నింగ్ ఇచ్చారు. ప్రయాణికుల లగేజీ కాకుండా ఇతర లగేజీ తీసుకువెళితే చర్యలు తీసుకుంటామన్నారు. 30 ప్రాంతాల్లో 24 గంటలపాటు ప్రత్యేక సిబ్బంది బస్సులను తనిఖీ చేస్తున్నారన్నారు.
News November 16, 2025
HYD: బిర్సా ముండా జయంతి సందర్భంగా ర్యాలీ

భగవాన్ బిర్సా ముండా జయంతి సందర్భంగా కేంద్ర మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి సావిత్రితో కలిసి ట్యాంక్ బండ్ వద్ద స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వివేకానంద విగ్రహం నుంచి కొమురం భీమ్ విగ్రహం వరకు ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆదివాసీల హక్కుల కోసం భగవాన్ బిర్సా ముండా చూపిన ధైర్యం ఎనలేనిదన్నారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పాల్గొన్నారు.
News November 16, 2025
HYD: బంధాన్ని నిలుపుకో.. వదులుకోకు..!

HYDలో మనువు మున్నాళ్ల ముచ్చటగా మారుతున్న పరిస్థితి కలవరపెడుతోంది. ఈగో, విలువలు తగ్గటం, వివాహేతర సంబంధాలు, అభద్రతా భావం, తొందరపాటు నిర్ణయాలు, కొత్తకల్చర్ వంటి వాటితో కోర్టు మెట్లెక్కుతున్నట్లు ఏటా నమోదవుతున్న కేసులు చెబుతున్నాయి. ఇందులో 25- 35 ఏళ్ల జంటలు 75% ఉన్నాయి. న్యాయస్థానాల్లో ప్రతినెలా 250 కేసులు నమోదవుతున్నాయి. బంధాన్ని బలపర్చుకోవడానికి ఆలోచించాలి కానీ బలహీనపరుచుకోవడానికి కాదని పెద్దల మాట.


