News June 25, 2024

ఎక్కువ మంది పిల్లలను కనొద్దు: గీతాలక్ష్మి

image

సమాజంలో మహిళల ఆరోగ్యానికి ప్రతి ఒక్కరూ ప్రాధాన్యమివ్వాలని నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రి గైనకాలజీ విభాగాధిపతి డాక్టర్ గీతాలక్ష్మి సూచించారు. ఎక్కువమంది పిల్లలను కనడం, ఎక్కువసార్లు ఆపరేషన్లు చేయడం ఆడవారి ఆరోగ్యానికి ప్రమాదకరమని చెప్పారు. సంతానం విషయంలో ప్రతిఒక్కరూ అవగాహనతో మెలగాలన్నారు. ‘ఒక్కరు ముద్దు.. ఇద్దరు హద్దు’ అనే నినాదాన్ని పాటించాలని పిలుపునిచ్చారు.

Similar News

News October 14, 2025

“బర్త్ రేట్ “లో నెల్లూరు ఎక్కడంటే?

image

రాష్ట్ర వ్యాప్తంగా birth rate ను పరిశీలిస్తే జిల్లాలో 1000 మంది బాలురుకు 1011 మంది బాలికలు ఉన్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. దీంతో రాష్ట్రంలో జిల్లా నాలుగో స్థానంలో నిలిచింది. లింగ వివక్షకు సంబంధించి చట్టాలు కఠినంగా ఉండడంతో కొంతమేరా వీటికి అడ్డుకట్ట పడినట్లు తెలుస్తోంది. అయితే ఏదొక మూల వైద్య శాఖ కళ్లు గప్పి లింగ నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయానేది సమాచారం.

News October 14, 2025

జిల్లా గిరిజన సంక్షేమ అధికారిగా సుజాత బాధ్యతలు

image

నెల్లూరు జిల్లా గిరిజన సంక్షేమ అధికారినిగా సుజాత బాధ్యతలు చేపట్టారు. గతంలో ఇక్కడ సంబంధిత శాఖ అధికారినిగా విధులు నిర్వహిస్తున్న పరిమళ బదిలీ కావడంతో కొద్ది కాలంగా ఈ పోస్ట్ భర్తీ కాలేదు. అల్లూరు సీతారామరాజు జిల్లా కూనవరంలో అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ అధికారిగా పని చేస్తున్న సుజాతకు ప్రమోషన్ లభించడంతో అధికారులు ఆమెను నెల్లూరుకు బదిలీ చేశారు.

News October 14, 2025

తగ్గిన డిమాండ్.. పతనమవుతున్న ధరలు

image

నెల్లూరు జిల్లాలో నిమ్మ ధరలు తగ్గుముఖం పట్టినట్లు వ్యాపారులు తెలిపారు. దేశ రాజధాని ఢిల్లీలో డిమాండ్ తగ్గడమే ఇందుకు కారణం అంటున్నారు. సాధారణంగా దీపావళికి డిమాండ్ ఉంటుందని, ఈ దఫా అవకాశం లేదంటున్నారు. ప్రస్తుతం ధర కిలో రూ.20 నుంచి రూ.30 వరకు పలుకుతుందన్నారు. రానున్న కాలంలో ఈ ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని వ్యాపారులు తెలిపారు.