News February 28, 2025

ఎక్స్‌పో 2025లో పాల్గొన్న మంత్రి కొండా సురేఖ

image

మహిళా వ్యవస్థాపక స్ఫూర్తిని పురస్కరించుకుని ఉమెన్స్ ఇంటర్నేషనల్ సమ్మిట్ ఆన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్(WISE&B2B) ఎక్స్‌పో 2025లో మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో మహిళా పారిశ్రామికవేత్తలు అభివృద్ధి చెందడానికి, ఆర్థిక వృద్ధికి దారితీసే సమ్మిళిత పర్యావరణ వ్యవస్థను రూపొందించడానికి తెలంగాణ కట్టుబడి ఉందన్నారు.

Similar News

News November 24, 2025

MHBD: ఎస్టీలకే అన్ని సర్పంచ్ స్థానాలు!

image

మహబూబాబాద్ రెవెన్యూ డివిజన్‌లోని 11 మండలాలకు సర్పంచ్ రిజర్వేషన్లను ఆర్డీవో కార్యాలయంలో ఆదివారం ఖరారు చేశారు. జిల్లాలోని బయ్యారం (29), కొత్తగూడ (24), గార్ల (20) మండలాల్లోని అన్ని సర్పంచ్ స్థానాలు ఎస్టీ (ST) సామాజిక వర్గానికే రిజర్వ్ కావడం చర్చనీయాంశంగా మారింది. ఈ నిర్ణయం వల్ల ఈ మూడు మండలాల్లో స్థానిక ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న ఇతర సామాజిక వర్గాల నాయకులకు నిరాశ తప్పలేదు.

News November 24, 2025

నరసరావుపేట: నేతన్నలకు అమలు కానీ ఉచిత విద్యుత్.!

image

చేనేత కార్మికుల కుటుంబాలకు ప్రతినెలా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు అందిస్తామని సీఎం చంద్రబాబు ఆగస్టు 7న హామీ ఇచ్చారు. హామీ ఇచ్చి మూడు నెలలు గడిచినా పథకం అమలు కాలేదని నేతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పల్నాడు జిల్లాలో కేవలం 280 మందిని మాత్రమే అర్హులుగా గుర్తించారు. చిలకలూరిపేట, సత్తెనపల్లి గ్రామాలలో పెద్ద సంఖ్యలో చేనేత కార్మికులు ఈ ఉచిత విద్యుత్ కోసం దరఖాస్తు చేసుకున్నారు.

News November 24, 2025

ADB: కొందరు ఖుషిలో.. ఇంకొందరు నిరాశలో

image

ఉమ్మడి జిల్లాలో సర్పంచ్ రిజర్వేషన్ల కేటాయింపు రిజర్వేషన్లు కొందరిని ఆనంద పర్చగా.. మరికొందరిని నిరాశలోకి నెట్టింది. జిల్లాలో బీసీలు ఆశించిన చాలా స్థానాలు మళ్లీ ఎస్టీలకు రిజర్వుడ్ కావడంతో నిరాశ అలుముకుంది. ఇదే సమయంలో బీసీలకు కేటాయించిన పలు స్థానాల్లో జనరల్ రిజర్వేషన్ రావడంతో తీవ్ర పోటీ నెలకొంది. తమకున్న అవకాశాలు చేజారాయని బీసీలు నిరాశలో ఉన్నారు. SC, STలు ఖుషీలో ఉన్నారు.