News March 12, 2025
ఎగ్జిబిషన్ సొసైటీ పూర్వవైభవానికి కృషి: కలెక్టర్

దశాబ్దాల చరిత్ర ఉన్న కృష్ణా పారిశ్రామిక, వ్యవసాయ ఎగ్జిబిషన్ సొసైటీకి పూర్వ వైభవం తెచ్చేందుకు కృషిచేయడం జరుగుతుందని, సొసైటీ కార్యకలాపాలకు జవసత్వాలు తెచ్చేందుకు సమగ్ర కార్యాచరణ అవసరమని కలెక్టర్ లక్ష్మీశ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో ఎగ్జిబిషన్ సొసైటీ సభ్యులతో సమావేశమయ్యారు.1975 మొదలు సొసైటీ కార్యకలాపాల్లో చోటుచేసుకున్న ఘటనలను సభ్యులు వివరించారు.
Similar News
News November 29, 2025
కేంద్ర మాజీ మంత్రి కన్నుమూత

కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత శ్రీప్రకాశ్ జైస్వాల్(81) కన్నుమూశారు. కార్డియాక్ అరెస్ట్తో కాన్పూర్లో తుదిశ్వాస విడిచారు. ఈయన 2004-2009 వరకు హోంశాఖ సహాయ మంత్రిగా, 2011-2014 మధ్య కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా విధులు నిర్వర్తించారు. కేంద్ర మంత్రి కావడానికి ముందు 2000-2002 వరకు ఈయన UPCC అధ్యక్షుడిగా సేవలందించారు. శ్రీప్రకాశ్ మృతి పట్ల కాంగ్రెస్ అగ్ర నేతలు సంతాపం తెలిపారు.
News November 29, 2025
నవంబర్ 29: చరిత్రలో ఈ రోజు

1759: గణిత శాస్త్రవేత్త నికోలస్ బెర్నౌలీ మరణం
1877: తొలిసారిగా థామస్ ఆల్వా ఎడిసన్ ఫోనోగ్రాఫ్ ప్రదర్శన
1901: చిత్రకారుడు, పద్మశ్రీ గ్రహీత శోభా సింగ్ జననం
1982: నటి, లోక్సభ మాజీ సభ్యురాలు రమ్య జననం
1993: పారిశ్రామికవేత్త జె.ఆర్.డి.టాటా మరణం(ఫొటోలో)
2009: తెలంగాణ కోసం కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభం
News November 29, 2025
కామారెడ్డి: రాష్ట్ర స్థాయికి నామినేట్ అయిన 8 పాఠశాలలు

జిల్లా స్థాయిలో SHVR 2025-26 బెస్ట్ రేటింగ్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా 8 పాఠశాలలు ఎంపికైనట్లు డీఈవో రాజు తెలిపారు. రూరల్లో TSNR ZPHS బీబీపేట్, ZPHS బోర్లం, ZPHS ధర్మారావుపేట్, PS మహమ్మదాపూర్, PS శక్తి నగర్, UPS ఇస్సన్నపల్లి, అర్బన్లో సరస్వతీ శిశుమందిర్ కామారెడ్డి, PS INC కామారెడ్డి స్కూల్స్ జిల్లా నుంచి రాష్ట్ర స్థాయికి నామినేట్ అయినట్లు DEO పేర్కొన్నారు.


