News March 12, 2025

ఎగ్జిబిష‌న్ సొసైటీ పూర్వవైభ‌వానికి కృషి: కలెక్టర్

image

ద‌శాబ్దాల చ‌రిత్ర ఉన్న కృష్ణా పారిశ్రామిక‌, వ్య‌వ‌సాయ ఎగ్జిబిష‌న్ సొసైటీకి పూర్వ వైభ‌వం తెచ్చేందుకు కృషిచేయ‌డం జ‌రుగుతుంద‌ని, సొసైటీ కార్య‌క‌లాపాల‌కు జ‌వ‌స‌త్వాలు తెచ్చేందుకు స‌మ‌గ్ర కార్యాచ‌ర‌ణ అవ‌స‌ర‌మ‌ని క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ అన్నారు. మంగ‌ళ‌వారం క‌లెక్ట‌రేట్లో ఎగ్జిబిష‌న్ సొసైటీ స‌భ్యుల‌తో స‌మావేశ‌మ‌య్యారు.1975 మొద‌లు సొసైటీ కార్య‌క‌లాపాల్లో చోటుచేసుకున్న ఘ‌ట‌న‌ల‌ను స‌భ్యులు వివ‌రించారు. 

Similar News

News November 21, 2025

తిరుమల: సర్వదర్శనానికి 8 గంటల టైమ్

image

AP: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. అటు వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని 9 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న వేంకటేశ్వరుడిని 66,839 మంది దర్శించుకోగా, 19,220 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా రూ.4.61 కోట్ల ఆదాయం వచ్చిందని టీటీడీ ప్రకటించింది.

News November 21, 2025

విశాఖ: ‘దళారులకు గంటా వార్నింగ్’

image

తర్లువాడ గూగుల్ డేటా సెంటర్ భూములకు శనివారం నుంచి పరిహారం రైతుల ఖాతాల్లో జమ అవుతుందని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ప్రకటించారు. ఎకరాకు రూ.20 లక్షలు, 20 సెంట్ల భూమి ఇస్తున్నట్లు తెలిపారు. ఎక్కువ ధర ఇప్పిస్తామని రైతులను మోసం చేస్తున్న దళారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులను ఆదేశించారు. న్యాయమైన రైతుల కోరికలను సీఎం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.

News November 21, 2025

ప.గో: ప్రియుడి మోసం.. విద్యార్థిని సూసైడ్

image

భీమవరం రూరల్ మండలం కొవ్వాడలో ఈ నెల 12న ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసం చేయడం వల్లే తన కుమార్తె ఆత్మహత్యకు పాల్పడిందని విద్యార్థిని తండ్రి ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై కేసు నమోదు చేసిన ఎస్ఐ వీర్రాజు.. నెల్లూరుకు చెందిన నిందితుడు నవీన్ రెడ్డిని హైదరాబాద్‌లో అరెస్ట్ చేసినట్లు తెలిపారు.